సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు..

- January 08, 2016 , by Maagulf
సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు..

సంక్రాంతి పండుగను పురష్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఈనెల 9, 17 తేదీల్లో సికింద్రాబాద్‌-కాకినాడ, ఈనెల 10,16 తేదీల్లో కాకినాడ-సికింద్రాబాద్‌ మధ్య ప్రత్యేక రైళ్లు నడుస్తాయని తెలిపారు. అలాగే 13న హైదరాబాద్‌-కాకినాడ, 14న కాకినాడ-హైదరాబాద్‌ మధ్య ప్రత్యేక రైళ్లు, 17న కాకినాడ పోర్టు నుంచి సికింద్రాబాద్‌కు ప్రత్యేక రైలు, ఈనెల 11, 18 తేదీల్లో సికింద్రాబాద్‌-తిరుపతి మధ్య రెండు ప్రత్యేక రైళ్లు నడుస్తాయని, 18న కాకినాడ-తిరుపతి, 15న తిరుపతి- కాకినాడ మధ్య ప్రత్యేక రైళ్లు నడుస్తాయని రైల్వే అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com