యూఏఈలో అందుబాటులోకి మరో 3డి జీబ్రా క్రాసింగ్
- September 05, 2019రస్ అల్ ఖైమా పోలీస్, ఎమిరేట్లోని పలు ప్రాంతాల్లో త్రీడీ జీబ్రా క్రాసింగ్స్ని ఏర్పాటు చేసే పనుల్ని వేగవంతం చేస్తున్నారు. ఎమిరేట్లో తొలి త్రీడీ జీబ్రా క్రాసింగ్ షేక్ మొహమ్మద్ బిన్ సలెమ్ రోడ్డుపై ఏర్పాటు చేశారు. యూకే మరియు ఇండియా తదితర దేశాల్లో ఈ విధానం కొన్ని చోట్ల ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. పెడెస్ట్రియన్ లైన్స్ వద్ద వాహనాలు వేగం తగ్గించడానికి ఈ త్రీడీ ముద్రిత జీబ్రా లైన్స్ ఉపయోగపడతాయి. రన్ ఓవర్ యాక్సిడెంట్లను ఈ త్రీడీ ముద్రిత జీబ్రా క్రాసింగ్స్ తగ్గిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అయితే, రోడ్లను దాటే పాదచారులు రోడ్డుపై వేగంగా వచ్చే వాహనాల పట్ల అప్రమత్తంగా వుండాలని సూచిస్తున్నారు అధికారులు. ఆర్టికల్ 43 ఫెడరల్ ట్రాఫిక్ చట్టం ప్రకారం, పాదచారులకు ప్రాధాన్యమివ్వకుండా వాహనాలు నడిపేవారికి 500 దిర్హామ్ల జరీమానా, ఆరు బ్లాక్ పాయింట్స్ విధిస్తారు.
తాజా వార్తలు
- అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
- లండన్లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు
- ఈసీ నిషేధం పై స్పందించిన కేసీఆర్..
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!