దుబాయ్ లో ఘనంగా గణేష్ ఉత్సవాలు
- September 07, 2019
దుబాయ్:బాధ్రపద మాసం శుద్ద చవితి నాడు ప్రథమ పూజ్యుడైన వినాయకుని చవితి వేడుకలను సోమవారం జెబెల్ అలీ లోని 'బు హలీబా' వర్కర్స్ క్యాంపు లో ఘనంగా ప్రారంభించారు.క్యాంపు ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపంలో గణ నాధునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ వర్కర్స్ క్యాంపు లో మన తెలుగు రాష్ట్రాలకు సంభందించిన కార్మికులు ఎక్కువగా నివసిస్తున్నారు.ఈ ఉత్సవాలు 5 రోజుల పాటు ఘనంగా నిర్వహించారు.ఏర్పాటుచేసిన గణనాధుని ప్రత్యేక అలంకరణ భక్తులను ఆకర్షించింది.
గత 6 సంవత్సరాలుగా గణపతి నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారని గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు తెలియజేశారు.గత శుక్రవారం చివరిరోజున యూ.ఏ.ఈ లోని పలు ప్రాతాలనుంచి 5000 మంది పైగా భక్తులు దర్శించుకున్నారు మరియు గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.సాయంత్రం నిమర్జనంలో 100 మంది పైగా కార్మికులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.





తాజా వార్తలు
- యుద్ధ ప్రభావం నుంచి కోలుకుంటున్న బహ్రెయిన్ దిగుమతులు..!!
- ఫాదర్ అమీర్ షేక్ హమద్ మృతిపై ప్రపంచ దేశాల సంతాపం..!!
- ఒమన్ ఆహార భద్రతకు కీలకంగా అల్ ధాహిరా పురోగతి..!!
- హోర్ముజ్ జలసంధి భద్రతపై సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- బార్డర్ పోస్టులు, సముద్ర చమురు ప్లాట్ఫామ్కు నష్టం: కువైట్
- వేసవి సెలవుల్లో ట్రాఫిక్కు బ్రేక్.. ఏడాది పొడవునా సాధ్యమేనా?
- బహ్రెయిన్లో సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- కువైట్ గగనతలంలోకి చొరబడిన శత్రు వైమానిక వస్తువులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- లూసైల్ స్టేడియం రోడ్డులో ట్రాఫిక్ ఆంక్షలు..!!
- కువైట్లో నాలుగు రోజుల పాటు అధికారిక సంతాప దినాలు..!!







