ఎఫ్ఏటీఎఫ్ సమీక్షతో తేలనున్న పాక్ భవితవ్యం
- September 08, 2019
ఇస్లామాబాద్: ఉగ్ర సంస్థలకు నిధులు అందకుండా, అక్రమ నగదు చలామణిని అరికట్టేందుకు పాక్ చేపడుతున్న చర్యలను ఎఫ్ఏటీఎఫ్ వచ్చే వారం పరిశీలించనుంది. పాక్ ఉగ్రవాద నిరోధక చర్యలు తీసుకోవడంలో విఫలమైనట్టు తేలినట్టయితే దానిని నిషేధిత జాబితాలో (బ్లాక్ లిస్ట్) చేర్చే అవకాశం ఉంది. 'ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్' అధికారులను కలవడానికి పాకిస్థాన్ ప్రతినిధి బృందం శనివారం బ్యాంకాక్ నగరానికి వెళ్లనుంది. సెప్టెంబర్ 8 నుంచి 10 వరకు జరగనున్న చర్చల్లో ఉగ్రవాదులకు నిధులు అంద కుండా పాక్ చేపడుతున్న చర్యలను ఎఫ్ఏటీఎఫ్ అధికారులకు ఈ బృందం వివరించనుంది అని పాక్ స్టేట్ మీడియా పేర్కొంది. ఎఫ్ఏటీఎఫ్ అడిగే 100 అదనపు ప్రశ్నలకూ ఈ బృందం సమాధానాలు ఇవ్వనుందని తెలిపింది. ఆగస్టు 18 నుంచి 23 వరకు ఆస్ట్రేలియా రాజధాని కాన్బెర్రాలో ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ వార్షిక (ఆసియా-పసిఫిక్) సమావేశం జరిగింది. ఈ భేటీలో ఉగ్రవాద నిరోధానికి తాము చేపడుతున్న 27 పాయింట్ల కార్యాచరణ ప్రణాళిక సమ్మతి నివేదికను పాక్ ఏఎఫ్టీఎఫ్కు సమర్పించింది. పాక్ నివేదికను సమూలంగా అధ్య యనం చేసిన తర్వాత దీన్ని ప్రస్తుతమున్న గ్రే లిస్టు నుంచి బ్లాక్ లిస్ట్లో పెట్టాలా ? వద్దా ? అనే అంశంపై ఎఫ్ఏటీఎఫ్ నిర్ణయం తీసుకోనుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి
- ముంబై ఆసుపత్రిలో పవన్ కల్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- ఈజిప్ట్లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!







