నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- September 19, 2025
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ విజయవాడలో జరగబోయే శ్రీ కనకదుర్గమ్మ దసరా నవరాత్రుల సందర్భంగా భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా ఏపీటీడీసీ చైర్మన్ డా.నూకసాని బాలాజీ గురువారం సచివాలయంలోని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని కలిసి ప్రత్యేక టూర్ ప్యాకేజీ గురించి వివరించారు. అనంతరం వినతి పత్రం అందించారు
ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తో ఏపీటీడీసీ చైర్మన్ బాలాజీ ఏమన్నారంటే సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 2 వరకు హైదరాబాదు – విజయవాడ ప్రత్యేక ప్యాకేజీ టూర్ ను కార్పొరేషన్ నిర్వహించనుంది. ఇందులో అమ్మవారి శీఘ్ర దర్శనం తో పాటు పర్యాటకులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించబడతాయి.ఈ సందర్భంలో, రూ.500 విలువ గల 60 శీఘ్ర దర్శన టిక్కెట్లు మంజూరు చేయాలని, అలాగే 12 సీటర్ల మినీ వాహనాలను గిరిపాదం నుండి ఆలయ ప్రాంగణం వరకు నడిపేందుకు అనుమతి ఇవ్వాలని ఎండోమెంట్స్ శాఖకు విజ్ఞప్తి చేసారు.
భక్తులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన మరియు ఆధ్యాత్మిక అనుభవం కలిగించే యాత్రా సేవలను అందించేందుకు కట్టుబడి ఉందని ఏపీటీడీసీ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- జూలై 9 వీసా గడువు: ఎవరి పై ప్రభావం? యూఏఈ స్పష్టీకరణ
- 37 లక్షలు దాటిన చార్ ధామ్ యాత్రికుల సంఖ్య..
- అల్-నాయెమ్ స్క్రాప్ యార్డ్లో అగ్నిప్రమాదం పై అప్డేట్..!!
- ఫాల్ 2026 సీజన్..ఖతార్ మ్యూజియమ్స్ విస్తృతమైన ప్రదర్శనలు..!!
- ముదురుకుంటున్న ఆర్థిక సంక్షోభం పై UNRWA హెచ్చరిక..!!
- సాదియత్ ఐస్లాండ్ లో జెట్ స్కీలను నిషేధించిన అబుదాబి..!!
- ప్రాంతీయ అంతరాయాలను సౌదీ పర్యాటకం అధిగమించింది..!!
- యూఏఈలో 5 రోజుల పాటు అపాయింట్మెంట్లను నిలిపివేసిన ఇండియన్ ఎంబసీ..!!
- విద్వేషపూరిత ప్రసంగాల నిర్మూలనకు ఒమన్ పిలుపు..!!
- పాస్పోర్ట్ సేవల్లో తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక పురస్కారం







