పాకిస్తాన్ రేంజర్ల తాట తీసిన భారత సైన్యం..
- September 14, 2019కశ్మీర్ సరిహద్దుల్లో కవ్వింపులకు పాల్పడుతున్న పాక్ రేంజర్ల తాట తీసింది భారత సైన్యం. హాజీపూర్ సెక్టార్లో భారత భద్రతా దళాలే టార్గెట్గా కాల్పులు జరిపిన పాక్ రేంజర్ల కుట్రను భారత సైన్యం దీటుగా తిప్పికొట్టింది. కాల్పుల్లో ఇద్దరు పాక్ రేంజర్లను హతమార్చింది ఇండియన్ ఆర్మీ. దీంతో భారత సైనికుల ముందు పాక్ ఆర్మీ చేతులెత్తేసింది. వైట్ ఫ్లాగ్ చూపించి డెడ్ బాడీలను తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు కెమెరాలో రికార్డయ్యాయి.
గత కొన్ని రోజులుగా సరిహద్దుల్లో పాక్ ఆర్మీ రెచ్చిపోతోంది. కాల్పులు జరుపుతూ కవ్వింపులకు దిగుతోంది. దీంతో భారత సైన్యం కూడా ఏమాత్రం తగ్గకుండా అదే స్థాయిలో బదులిస్తోంది.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు..
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వీకెండ్ లి మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్ఫారమ్ ప్రారంభం
- దుబాయ్లో కలరా కేసులు నమోదుపై అధికారుల క్లారిటీ
- హజ్ 2024..నుసుక్ యాత్రికుల కార్డు ఆవిష్కరణ
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!