పాకిస్తాన్ రేంజర్ల తాట తీసిన భారత సైన్యం..

- September 14, 2019 , by Maagulf
పాకిస్తాన్ రేంజర్ల తాట తీసిన భారత సైన్యం..

కశ్మీర్‌ సరిహద్దుల్లో కవ్వింపులకు పాల్పడుతున్న పాక్‌ రేంజర్ల తాట తీసింది భారత సైన్యం. హాజీపూర్‌ సెక్టార్‌లో భారత భద్రతా దళాలే టార్గెట్‌గా కాల్పులు జరిపిన పాక్‌ రేంజర్ల కుట్రను భారత సైన్యం దీటుగా తిప్పికొట్టింది. కాల్పుల్లో ఇద్దరు పాక్‌ రేంజర్లను హతమార్చింది ఇండియన్‌ ఆర్మీ. దీంతో భారత సైనికుల ముందు పాక్‌ ఆర్మీ చేతులెత్తేసింది. వైట్‌ ఫ్లాగ్‌ చూపించి డెడ్‌ బాడీలను తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు కెమెరాలో రికార్డయ్యాయి.

గత కొన్ని రోజులుగా సరిహద్దుల్లో పాక్‌ ఆర్మీ రెచ్చిపోతోంది. కాల్పులు జరుపుతూ కవ్వింపులకు దిగుతోంది. దీంతో భారత సైన్యం కూడా  ఏమాత్రం తగ్గకుండా అదే స్థాయిలో బదులిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com