ప్రవాసులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం

- September 15, 2019 , by Maagulf
ప్రవాసులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం

న్యూఢిల్లీ: ప్రవాస భారతీయులు ఆధార్‌ కార్డు పొందేందుకు స్వదేశంలో 3 నెలలు ఉన్నా సరిపోతుందని అధికారులు తెలిపారు. ఈ మేరకు యూఐడీఏఐ సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేస్తామని సీఈవో అజయ్‌ భూషణ్‌ పాండే చెప్పారు. గతంలో స్వదేశంలో కనీసం 180 రోజులు ఉన్న వారికే ఆధార్‌కార్డు ఇచ్చేవారు. ఇక నుంచి విదేశాల్లో ఉండగానే పాస్‌పోర్టు ఆధారంగా ఆధార్‌కార్డు టైమ్‌ స్లాట్‌ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని, తాము కార్డు తీసుకోవాలనుకునే కేంద్రాన్ని కూడా అప్పుడే పేర్కొనాలని పాండే తెలిపారు. స్వదేశానికి వచ్చిన తర్వాత 90 రోజుల్లో ఆధార్‌ కేంద్రానికి వెళ్లి కార్డు పొందవచ్చని వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com