తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్పై కీలక చర్చ
- September 15, 2019
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్పై కీలక చర్చ జరుగుతోంది. ఆదివారం నాడు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవ్వగానే బడ్జెట్పై ప్రతిపక్ష పార్టీ సభ్యులు పలు ప్రశ్నలు సంధించారు. ఇందుకు స్వయంగా సీఎం కేసీఆరే సమాధానాలిచ్చారు. దేశంపై ఆర్ధికమాద్యం ప్రభావం విస్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఎందరో ఆర్థిక నిపుణులు, ప్రముఖులు మాద్యంపై వ్యాసాలు రాస్తున్నారని సీఎం స్పష్టం చేశారు. దేశ ఆర్థికవ్యవస్థపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోందన్నారు. ‘ఆర్థిక మాంద్యంతో మూడేళ్లదాకా తేరుకోలేమని రతన్ టాటా, ఆనంద్ మహీంద్రా లాంటివారు చెబుతున్నారు. ఆర్థిక నిపుణుల విశ్లేషణను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ రూపొందించాం. అభివృద్ధిని అడ్డుకునేందుకే కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయి. ఆర్ధికమాద్యం ప్రభావం అన్ని రంగాలపై పడింది. ప్రస్తుతం కేంద్రంలో 5శాతం మాత్రమే వృద్ధిరేటు నమోదైంది. గడిచిన ఐదేళ్లలో 21 శాతం వృద్ధిరేటు సాధించాం. ఆర్థిక మాంద్యం ప్రభావం చాలా రంగాలపై ఉంది.. మేము కూడా అందుకు తగ్గట్లు సిద్ధమయ్యాం. ఇప్పటికే చర్యలు తీసుకున్నాం. మూడేళ్ల వరకూ కోలుకోలేదని నిపుణులు ఇప్పటికే చెప్పారు. అన్నింటినీ అంచనా వేసే బడ్జెట్ రూపొందించాం’ అని కేసీఆర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







