భారత్ అమ్ములపొది కి చేరిన స్పైస్ 2000 ఇజ్రాయెల్ బాంబులు

- September 16, 2019 , by Maagulf
భారత్ అమ్ములపొది కి చేరిన స్పైస్ 2000 ఇజ్రాయెల్ బాంబులు

భారత వైమానిక దళానికి మరింత బలం చేకూరింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు ఇజ్రాయెల్ దేశం నుంచి అత్యంత శక్తివంతమైన స్పైస్ 2000 బాంబులు వచ్చాయి. భారతదేశం ఇజ్రాయెల్ దేశంతో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా మొదటి విడత స్పైస్ 2000 బాంబులు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్ లోని వైమానిక కేంద్రానికి వచ్చాయి. ఈ సరికొత్త బాంబులకు భవనాలను పూర్తిగా నాశనం చేయగల సామర్థ్యం ఉన్నాయి. ఒప్పందం ప్రకారం ఇజ్రాయెల్ నుంచి మరిన్ని బాంబులు రానున్నాయి. నరేంద్ర మోడీ ప్రభుత్వం అత్యవసరంగా ఈ ఏడాది జూన్‌లో బాంబుల కొనుగోలుకు ఇజ్రాయెల్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇటీవల భారత వాయుసేన పాకిస్థాన్ దేశంలోని బాలాకోట్ ఉగ్రవాద శిబిరాలను స్పైస్ 2000 బాంబులతోనే పేల్చివేసింది. మిరాజ్ యుద్ద విమానాల నుంచి స్పైస్ -2000 బాంబులను వాయుసేన ఉగ్ర శిబిరాలపై వేసి ధ్వంసం చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com