భారత్ అమ్ములపొది కి చేరిన స్పైస్ 2000 ఇజ్రాయెల్ బాంబులు
- September 16, 2019
భారత వైమానిక దళానికి మరింత బలం చేకూరింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు ఇజ్రాయెల్ దేశం నుంచి అత్యంత శక్తివంతమైన స్పైస్ 2000 బాంబులు వచ్చాయి. భారతదేశం ఇజ్రాయెల్ దేశంతో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా మొదటి విడత స్పైస్ 2000 బాంబులు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్ లోని వైమానిక కేంద్రానికి వచ్చాయి. ఈ సరికొత్త బాంబులకు భవనాలను పూర్తిగా నాశనం చేయగల సామర్థ్యం ఉన్నాయి. ఒప్పందం ప్రకారం ఇజ్రాయెల్ నుంచి మరిన్ని బాంబులు రానున్నాయి. నరేంద్ర మోడీ ప్రభుత్వం అత్యవసరంగా ఈ ఏడాది జూన్లో బాంబుల కొనుగోలుకు ఇజ్రాయెల్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇటీవల భారత వాయుసేన పాకిస్థాన్ దేశంలోని బాలాకోట్ ఉగ్రవాద శిబిరాలను స్పైస్ 2000 బాంబులతోనే పేల్చివేసింది. మిరాజ్ యుద్ద విమానాల నుంచి స్పైస్ -2000 బాంబులను వాయుసేన ఉగ్ర శిబిరాలపై వేసి ధ్వంసం చేసింది.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







