దుబాయ్-మస్కట్: రోడ్డు ప్రమాదంలో వరంగల్ కు చెందిన కుటుంబం మృతి
- September 16, 2019దుబాయ్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నగరానికి చెందిన ముగ్గురు మృతి చెందగా ఓ నాలుగేళ్ళ చిన్నారి తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. కుటుంబ సభ్యులు, స్నేహితులు తెలిపిన వివరాల ప్రకారం..వరంగల్కు చెందిన గౌస్ఉల్లా ఖాన్(30) నగరంలోని టోలిచౌకీలో ఉంటూ ఉద్యోగరీత్యా యూఏఈ వెళ్ళాడు. కాగా, ఇతడు శుక్రవారం ఉల్లాఖాన్తో పాటు భార్య అయేషా (30), కుమారుడు హమ్జ (8 నెలలు), కుమార్తె హానియా సిద్ధిఖి(3)లతో కలసి దుబాయ్ సలాల హైవే మీదుగా మస్కట్కు కారులో బయల్దేరి వెళ్తున్నాడు. అయితే ఎదురుగా వస్తున్న వాహనం వీరి కారును ఢీకొట్టడంతో గౌస్ఉల్లా, అయేషా, హమ్జలు అక్కడికక్కడే మృతి చెందారు.
ఈ ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన కుమార్తె హానియాను చికిత్స నిమిత్తం దుబాయ్లోని కౌలా ఆస్పత్రిలో పోలీసులు చేర్పించారు. కాగా సమాచారం అందుకున్న గౌస్ఉల్లాఖాన్ కుటుంబ సభ్యులు శనివారం మధ్యాహ్నం మస్కట్కు వెళ్ళారు. ఆదివారం ఉదయం మృతదేహాలను నగరానికి తీసుకువస్తారని తెలిసింది. కాగా, ఆదివారం టోలిచౌకీ సాలార్జంగ్ కాలనీలోని మజ్జీద్ ఎ సాలార్జంగ్లో మధ్యాహ్నం 1ః30 గంటలకు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తామని స్థానికులు తెలిపారు.
తాజా వార్తలు
- T20 వరల్డ్కప్.. ఏప్రిల్ 28న భారత జట్టు ఎంపిక..!
- ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ చేస్తాం: సీఎం రేవంత్
- ప్రతి ఒక్కరూ ఓటు హక్కును ఉపయోగించుకోవాలి: జస్టీస్ చంద్రచూడ్
- ఇళ్లకు ఉచితంగా మరమ్మతులు..ముందుకొచ్చిన డెవలపర్లు
- దుబా పోర్ట్లో భారీ డ్రగ్ స్మగ్లింగ్ గుట్టురట్టు
- మిడిల్ ఈస్ట్ వివాదం నివారణకు ఖతార్ పిలుపు
- షార్జాలో అదృశ్యమైన యువకుడు క్షేమం
- అబ్దల్లి కారు ప్రమాదంలో భారతీయ వ్యక్తి మృతి
- ఐక్యరాజ్యసమితి నిర్ణయంపై సర్వత్రా విచారం
- కాషాయ రంగులో దూరదర్శన్ లోగో.. ప్రతిపక్షాల విమర్శలు