ఇండియా లో ఈ-సిగరెట్లపై కేంద్రం నిషేధం..
- September 18, 2019ఇండియా:ఈ-సిగరెట్లపై కేంద్రం నిషేధం విధించింది. ఈ-సిగరెట్ల దిగుమతి, ఎగుమతి, విక్రయాలు, ప్రచారం వంటి అంశాలపై నిషేధం విధించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. యువతపై ఈ సిగరెట్ల ప్రభావం అధికంగా ఉందని.. అవి వారిపై తీవ్రమైన చెడు ప్రభావాన్ని చూపుతున్నాయని తెలిపారు. అమెరికా అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు నిర్మలా సీతారామన్.
పొగాకు బారిన పడి అనారోగ్యాలకు గురవుతున్నవారి సంఖ్యను తగ్గించాలనేది ప్రభుత్వం లక్ష్యం అన్నారు. ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రతిపాదనను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రతిపాదించగా.. కేబినెట్ ఆమోదించింది. పొగ తాగే అలవాటు తగ్గించుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా యువత ఈ-సిగరెట్లను ఆశ్రయిస్తున్నారు. భారతీయ యువతలో ఇదొక వ్యసనంగా మారకుండా జాగ్రత్తలు తీసుకొనేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం