ఇ-ఫ్రాడ్: ఏడుగురు వలసదారుల అరెస్ట్
- September 20, 2019మస్కట్: ఏడుగురు వలసదారుల్ని రాయల్ ఒమన్ పోలీసులు ఇ-ఫ్రాడ్ కేసులో అరెస్ట్ చేశారు. సిటిజన్స్నీ, రెసిడెంట్స్నీ బ్యాంకు ఉద్యోగులుగా నమ్మించి నిందితులు ఫ్రాడ్కి పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఎంపిక చేసుకున్న వినియోగదారులకు మెసేజ్లు పంపి, క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ని అప్డేట్ చేసుకోమని కోరుతున్నారనీ, ఈ క్రమంలో వారి నుంచి వివరాలు సేకరించి, వారి బ్యాంక్ అక్కౌంట్ల నుంచి డబ్బుల్ని నిందితులు తస్కరిస్తున్నారని వివరించారు రాయల్ ఒమన్ పోలీస్. నిందితులు ఈ నేరాలకు పాల్పడేందుకు పెద్దయెత్తున మొబైల్ ఫోన్లను వినియోగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇలాంటి మోసాలపట్ల అప్రమత్తంగా వుండాలని అధికారులు పౌరులు, రెసిడెంట్స్కి సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై ముంబై విజయం
- ప్రపంచ రెండో ర్యాంకర్కు షాకిచ్చిన మనిక బాత్రా…
- TSRTC: పాస్ ఉంటే డీలక్స్ బస్సులోనూ ప్రయాణం…
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు