ఇండియా:బ్యాంకులకు వరుసగా సెలవులు..
- September 20, 2019ఇండియా:ఈ నెలలో బ్యాంకులకు వరుసగా ఐదు రోజులు సెలవులు వచ్చాయి. ఈ నెల 26 , 27 న దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చాయి బ్యాంకు యూనియన్లు. అలాగే 28వ తేదీ నాలుగో శనివారం బ్యాంకులకు సెలవు దినం కాగా.. 29 ఆదివారం. తిరిగి సోమవారం (సెప్టెంబర్ 30)న బ్యాంకులకు అర్ధ సంవత్సర ముగింపు రోజు. అయితే ఆ రోజూ కూడా బ్యాంకు లావాదేవీలు ఉండవు. దీంతో వరుసగా ఐదు రోజులపాటు బ్యాంకులు మూత పడనున్నాయి. ఆ తర్వాత నెల అక్టోబరు ఒకటో తేదీన బ్యాంకులు ఓపెన్ అవుతుండగా.. ఆ మరోసటీ రోజు గాంధీ జయంతి సందర్భంగా బ్యాంకులకు మళ్ళీ సెలవు ఉండనుంది. దీంతో వారం రోజుల వ్యవధిలోనే ఆరురోజుల సెలవులు బ్యాంకులకు ఉండనున్నాయి. ఐదురోజులు వరుస సెలవులు ఉండనుండటంతో ఏటీఎంలలో నగదు కొరత ఏర్పడే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఎక్కువ నగదు కావాలనుకునే ఖాతాదారులు నగదు కోసం బ్యాంకుల వద్ద క్యూలు కడుతున్నారు.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి