యూఏఈలో గోల్డ్ కార్డ్ పొందిన డా.జులేఖా దౌద్
- September 20, 2019దుబాయ్: యూఏఈ తదితర దేశాల్లో శాశ్వత పౌరసత్వం పొందిన విదేశీయులకు ఇచ్చే గోల్డ్కార్డును తొలిసారిగా ఓ భారతీయ మహిళ పొందారు.జులేఖా దౌద్(81) మహారాష్ట్ర లోని నాగపూర్ కి చెందిన వారు.జులేఖా దౌద్ యూఏఈ లో డాక్టర్ గా వృత్తి ప్రారంభించి జులేఖా హాస్పిటల్ని స్థాపించారు.ఈ గోల్డ్కార్డుల విధానాన్ని అమలు చేయడం మొదలెట్టగానే.. తొలి గోల్డ్కార్డును దుబాయ్ లో వ్యాపారం చేస్తున్న భారత వ్యాపారవేత్తకే ఇచ్చారు. ఇప్పడు కూడా జులేఖా దౌద్ అనే ఓ డాక్టరుకు ఈ కార్డు అందజేశారు. వైద్యరంగానికి ఆమె చేసిన సేవలను గుర్తించిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కొందరు అధికారులు తెలిపారు.
ప్రభుత్వం గోల్డ్కార్డు విధానాన్ని అమల్లోకి తెచ్చింది. శాశ్వత పౌరసత్వం పొందిన విదేశీయులకు అమెరికా గ్రీన్కార్డులు ఇస్తుందని తెలిసిందే. ఈ తరహాలోనే తమ దేశంలోని వలసదారులకు కూడా ఇక్కడ శాశ్వత పౌరసత్వం పొందే అవకాశం కల్పించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఈ కొత్త విధానాన్ని రూపొందించింది.
తాజా వార్తలు
- ఖతార్లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
- ప్లేఆఫ్స్కు చేరిన హైదరాబాద్..
- నేడు లండన్ పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్
- రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. రుణమాఫీ పై చర్చ..!