వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్: దోహాకి అథ్లెట్స్ రాక మొదలు
- September 23, 2019
ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ (ఐఎఎఫ్) వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్స్ నేపథ్యంలో అథ్లెట్స్, స్పోర్ట్స్ అఫీషియల్స్ రావడం మొదలైంది. ఐదు రోజుల్లో ఈ మెగా ఈవెంట్ జరగబోతోంది. 209 దేశాలకు చెందిన 2,000 మందికి పైగా అథ్లెట్స్ ఈ పోటీల్లో పాల్గొంటారు. సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 6 వరకు ఈ పోటీలు జరుగుతాయి. కాగా, ఖతార్ అధికార యంత్రాంగం ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేసింది. ట్రాఫిక్, ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ యూనిట్స్, అథ్లెట్స్కి, వారి సహాయకులకి ఎలాంటి ఇబ్బందులూ రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ పోటీల కోసం వచ్చే అథ్లెట్స్ కోసం ప్రత్యేకంగా కౌంటర్లను హమాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వద్ద ఏర్పాటు చేశారు. భద్రత పరంగా కనీ వినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









