హైదరాబాద్:నగల షోరూంలో దోపిడీకి స్కెచ్...
- September 23, 2019హైదరాబాద్ శివార్లలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. ఓ గోల్డ్ షోరూంలో దోపిడీకి దొంగలు స్కెచ్ వేయగా.. దుండిగల్ ఎస్సై అడ్డుకున్నారు. స్పాట్కు వచ్చిన ఎస్సై శేఖర్రెడ్డిని.. తమ వెహికల్తో ఢీ కొట్టి.. హత్య చేసేందుకు ప్రయత్నించారు. అయితే.. దొంగల బారి నుంచి దుండిగల్ ఎస్సై.. చాకచక్యంగా తప్పించుకున్నారు.
దోపిడీ దొంగలు తనపై హత్యాయత్నం చేసినా ఎస్సై శేఖర్రెడ్డి ఏమాత్రం భయపడలేదు. వెంటనే వారిని వెంబడించారు. సినీ ఫక్కీలో ఛేజింగ్ సీన్ జరిగింది. దొంగలు దూలపల్లి అడవుల్లోకి పారిపోయారు. వాళ్లు వాడిన వాహనం, కట్టర్, షట్టర్లు తెరిచేందుకు ఉపయోగించే సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
దోపిడీ దొంగలు వాడిన వాహనం.. ఆల్వాల్లో దొంగిలించినదిగా పోలీసులు గుర్తించారు. వాళ్లు అంతకుముందు.. రెండు ఏటీఎంలను దోచుకునేందుకు విఫల ప్రయత్నం చేశారని తేల్చారు. దూలపల్లి అటవీ ప్రాంతంలోకి పారిపోయిన దొంగల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..