టాయిలెట్లో ఫోన్ వాడితే ఈ వ్యాధి రావటం ఖాయం!
- September 27, 2019
ఒక్క క్షణం ఫోన్ కనిపించకపోతే.. ప్రళయం ముంచుకొస్తున్నంత కంగారు వస్తుంది. పని ఉన్నా లేకపోయినా అది నిత్యం చేతిలో ఉండాల్సిందే. చివరికి.. టాయిలెట్కు వెళ్లినా సరే అది తోడు రావల్సిందే. లేకపోతే.. ఏదో వెలితిగా ఉంటుంది. ఒక పక్క ‘ఆ పని’ పూర్తి చేస్తూనే మరో పక్క.. మొబైల్తో టైంపాస్ చేయడం నేటి యువతకు అలవాటు.
అయితే, అలవాటు మీకు కొత్త రోగాలను అంటగడుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. బ్రిటన్కు చెందిన ఓ సర్వే ప్రకారం.. ఆ దేశానికి చెందిన యువతలో 57 శాతం మంది టాయిలెట్లో సైతం మొబైల్తోనే టైంపాస్ చేస్తున్నారని పేర్కొంది. ఒక వైపు ఫోన్ చూస్తూనే మరోవైపు విసర్జన పని పూర్తిచేస్తామని యువత అంగీకరించారని తెలిపింది.
ఇలా టాయిలెట్లలో ఫోన్తో గడపడం వల్ల మూలశంక వ్యాధి (పైల్స్) ఏర్పడుతుందని, పిరుదుల్లో మొలలు పుట్టుకొస్తాయి. ఈ సర్వేపై పేషెంట్ డాట్ ఇన్ఫో డైరెక్టర్ డాక్టర్ సారా జర్వీస్ మాట్లాడుతూ.. ‘‘టాయిలెట్నూ మొబైల్ ఫోన్ వాడటం వల్ల అవసరం కంటే ఎక్కువ సేపు అందులో కూర్చుంటారు. దీనివల్ల పెద్ద పేగు చివరి భాగంలో గల పాయువులోని సిరలపై ఒత్తిడి పడుతుంది’’ అని తెలిపారు.
‘‘మలబద్ధకం, మొలలు సమస్య వల్ల భవిష్యత్తులో కూర్చోడానికే ఇబ్బంది ఏర్పడుతుంది. ఆ భాగం పుండులా మారుతుంది. ఒక్కోసారి రక్తస్రావం కూడా జరుగుతుంది. విసర్జనకు వెళ్లాలంటేనే భయపడిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. గర్బిణీ స్త్రీలు, దీర్ఘకాలిక దగ్గు, వృద్ధుల్లో ఎక్కువగా కనిపించే ఈ సమస్య యుక్త వయస్సులోనే ఏర్పడే అవకాశాలు ఉన్నాయి’’ అని సారా పేర్కొన్నారు.
‘‘పిరుదులపై దురద, విసర్జన రంగు ఎర్రగా మారడం, విసర్జన పూర్తయినా ఇంకా వస్తున్నట్లే అనిపించడం, చీము రావడం వంటి లక్షణాలు కనిపించినట్లయితే.. అవి మూలశంఖకు సంకేతాలని భావించాలి. ఈ సమస్య నుంచి బయటపడాలంటే.. బాధితులు ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినాలి. నిత్యం వ్యాయామం చేయాలి. అన్నిటికంటే ముఖ్యంగా.. మీ మొబైల్ ఫోన్ను బయట పెట్టి ప్రశాంతంగా టాయిలెట్లో కూర్చోండి’’ అని తెలిపారు. చూశారుగా.. ఇకపై టాయిలెట్లోకి వెళ్లినప్పుడు ఈ సూచలను తప్పకుండా గుర్తుంచుకోండి. లేకపోతే భవిష్యత్తులో కూర్చోడానికి కూడా ఇబ్బందిపడే పరిస్థితి ఏర్పడుతుంది.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







