టాయిలెట్లో ఫోన్ వాడితే ఈ వ్యాధి రావటం ఖాయం!
- September 27, 2019ఒక్క క్షణం ఫోన్ కనిపించకపోతే.. ప్రళయం ముంచుకొస్తున్నంత కంగారు వస్తుంది. పని ఉన్నా లేకపోయినా అది నిత్యం చేతిలో ఉండాల్సిందే. చివరికి.. టాయిలెట్కు వెళ్లినా సరే అది తోడు రావల్సిందే. లేకపోతే.. ఏదో వెలితిగా ఉంటుంది. ఒక పక్క ‘ఆ పని’ పూర్తి చేస్తూనే మరో పక్క.. మొబైల్తో టైంపాస్ చేయడం నేటి యువతకు అలవాటు.
అయితే, అలవాటు మీకు కొత్త రోగాలను అంటగడుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. బ్రిటన్కు చెందిన ఓ సర్వే ప్రకారం.. ఆ దేశానికి చెందిన యువతలో 57 శాతం మంది టాయిలెట్లో సైతం మొబైల్తోనే టైంపాస్ చేస్తున్నారని పేర్కొంది. ఒక వైపు ఫోన్ చూస్తూనే మరోవైపు విసర్జన పని పూర్తిచేస్తామని యువత అంగీకరించారని తెలిపింది.
ఇలా టాయిలెట్లలో ఫోన్తో గడపడం వల్ల మూలశంక వ్యాధి (పైల్స్) ఏర్పడుతుందని, పిరుదుల్లో మొలలు పుట్టుకొస్తాయి. ఈ సర్వేపై పేషెంట్ డాట్ ఇన్ఫో డైరెక్టర్ డాక్టర్ సారా జర్వీస్ మాట్లాడుతూ.. ‘‘టాయిలెట్నూ మొబైల్ ఫోన్ వాడటం వల్ల అవసరం కంటే ఎక్కువ సేపు అందులో కూర్చుంటారు. దీనివల్ల పెద్ద పేగు చివరి భాగంలో గల పాయువులోని సిరలపై ఒత్తిడి పడుతుంది’’ అని తెలిపారు.
‘‘మలబద్ధకం, మొలలు సమస్య వల్ల భవిష్యత్తులో కూర్చోడానికే ఇబ్బంది ఏర్పడుతుంది. ఆ భాగం పుండులా మారుతుంది. ఒక్కోసారి రక్తస్రావం కూడా జరుగుతుంది. విసర్జనకు వెళ్లాలంటేనే భయపడిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. గర్బిణీ స్త్రీలు, దీర్ఘకాలిక దగ్గు, వృద్ధుల్లో ఎక్కువగా కనిపించే ఈ సమస్య యుక్త వయస్సులోనే ఏర్పడే అవకాశాలు ఉన్నాయి’’ అని సారా పేర్కొన్నారు.
‘‘పిరుదులపై దురద, విసర్జన రంగు ఎర్రగా మారడం, విసర్జన పూర్తయినా ఇంకా వస్తున్నట్లే అనిపించడం, చీము రావడం వంటి లక్షణాలు కనిపించినట్లయితే.. అవి మూలశంఖకు సంకేతాలని భావించాలి. ఈ సమస్య నుంచి బయటపడాలంటే.. బాధితులు ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినాలి. నిత్యం వ్యాయామం చేయాలి. అన్నిటికంటే ముఖ్యంగా.. మీ మొబైల్ ఫోన్ను బయట పెట్టి ప్రశాంతంగా టాయిలెట్లో కూర్చోండి’’ అని తెలిపారు. చూశారుగా.. ఇకపై టాయిలెట్లోకి వెళ్లినప్పుడు ఈ సూచలను తప్పకుండా గుర్తుంచుకోండి. లేకపోతే భవిష్యత్తులో కూర్చోడానికి కూడా ఇబ్బందిపడే పరిస్థితి ఏర్పడుతుంది.
తాజా వార్తలు
- 30 ఎయిర్బస్ విమానాలు ఆర్డర్ చేసిన ఇండిగో
- JEE మెయిన్ రిజల్ట్స్ విడుదల..
- రేపు హైదారాబాద్ లో ఉపరాష్ట్రపతి పర్యటన..
- ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ పాస్కీ సపోర్టు వచ్చేసింది..
- అమెరికా రిపోర్టును తిరస్కరించిన భారత్
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!