సౌదీ అరేబియా:తొలిసారి టూరిస్ట్ వీసా జారీ చేయనుంది
- September 27, 2019
సౌదీ అరేబియా:సౌదీ అరేబియా మొదటిసారిగా పర్యాటక వీసాలు జారీ చేయనుంది.
పర్యాటక రంగాన్ని పెంపొందించుకునే క్రమంలో భాగంగా సౌదీ అరేబియా కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నడూ లేని విధంగా పర్యాకట వీసాలు జారీ చేయనుంది. 2030కెల్లా దేశ పర్యాటక రంగం ద్వారా అధిక ఆదాయాన్ని అర్జించే కార్యక్రమంలో భాగంగా ఈ మేరకు సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల చమురు బావులపై జరిగిన దాడుల్లో ఆదేశ ఆదాయానికి తీవ్ర నష్టం వాటిల్లింది. దాన్ని పర్యాటకం ద్వారా భర్తీ చేసుకోనుంది.
'అంతర్జాతీయ పర్యాటకులకు వీసా జారీ చేయనుండటం సౌదీ అరేబియా చరిత్రలో చారిత్రక ఘట్టం. సౌదీలోని పర్యాటక ప్రాంతాలను చూసి కచ్చితంగా ఆశ్యర్యానికి గురవుతారు. ప్రకృతి అందాలు, యునెస్కో గుర్తించిన ఐదు వారసత్వ ప్రదేశాలు పర్యాటకులను కచ్చితంగా కనువిందు చేస్తాయి' అని సౌదీ ఓ ప్రకటనలో వెల్లడించింది. శనివారం నుంచి ఈ మేరకు దరఖాస్తులు స్వీకరించే కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ప్రపంచ వ్యాప్తంగా 49 దేశాల పౌరులు ఇందుకు అర్హులు. విదేశీయుల డ్రెస్ కోడ్ విషయంలోనూ సౌదీ కఠిన నిబంధనలను సడలించింది.సౌదీలోని రియాద్ అభివృద్ధి చెందిన నగరాల్లో ఒకటి. ఎడారిలో నిర్మించిన ఈ నగరం ఎత్తైన కట్టడాలు, అద్భుతమైన నిర్మాణాలు ఉన్నాయి. ఈ కట్టడాలు, నిర్మాణాల కారణంగా అందరిని ఈ నగరం ఆకర్షిస్తోంది. దేశవిదేశాల నుంచి ఎక్కువ మంది పనులకు ఈ నగరానికి వస్తుంటారు. రియాద్ నగరం ఎందరికో ఉపాధిని కల్పిస్తోంది.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









