ఐఎస్ఎస్లో ప్రయోగాల్ని ప్రారంభించిన యూఏఈ ఆస్ట్రోనాట్
- September 27, 2019
యూఏఈ:హజా అల్ మన్సూరి, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)కి చేరుకోగానే, అక్కడ తన ప్రయోగాల్ని ప్రారంభించారు. యూఏఈ టైమ్ ప్రకారం సెప్టెంబర్ 26 తెల్లవారుఝామున 2.12 నిమిషాలకు అల్ మన్సూరి ఐఎస్ఎస్ కేంద్రానికి చేరుకున్నారు. జోయుజ్ ఎంఎస్ 15 రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి వెళ్ళారాయన. రష్యన్ కాస్మోనాట్ ఒలెగ్ స్క్రిపోచ్కా, యూఎస్ ఆస్ట్రోనాట్ జెస్సికా మీర్ కూడా ఆయనతోపాటు అంతరిక్షంలోకి వెళ్ళారు. ఉదయం ప్రార్థనలతో అల్ మన్సౌరి తన పనుల్ని ప్రారంభించినట్లు మొహమ్మద్ బిన్ రషీద్ స్సేన సెంటర్ పేర్కొంది.వారం రోజుల్లో అల్ మన్సౌరి తిరిగి భూమికి చేరుకుంటారు. ఈలోగా ప్రతిరోజూ, మైక్రో గ్రావిటీ ఇంపాక్ట్ సహా అనేక అంశాలపై ప్రయోగాలు నిర్వహిస్తారు. బ్రెయిన్ డిటిఐ, ఓస్టియాలజీ, మోటార్ కంట్రోల్, మైక్రో గ్రావిటీలో టైమ్ పర్సెప్షన్, ఫ్యూయిడిక్స్, డిఎన్ఎఎమ్ ఏజ్ వంటి వాటిపైనా ఆయన ప్రయోగాలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్







