ఐఎస్ఎస్లో ప్రయోగాల్ని ప్రారంభించిన యూఏఈ ఆస్ట్రోనాట్
- September 27, 2019
యూఏఈ:హజా అల్ మన్సూరి, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)కి చేరుకోగానే, అక్కడ తన ప్రయోగాల్ని ప్రారంభించారు. యూఏఈ టైమ్ ప్రకారం సెప్టెంబర్ 26 తెల్లవారుఝామున 2.12 నిమిషాలకు అల్ మన్సూరి ఐఎస్ఎస్ కేంద్రానికి చేరుకున్నారు. జోయుజ్ ఎంఎస్ 15 రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి వెళ్ళారాయన. రష్యన్ కాస్మోనాట్ ఒలెగ్ స్క్రిపోచ్కా, యూఎస్ ఆస్ట్రోనాట్ జెస్సికా మీర్ కూడా ఆయనతోపాటు అంతరిక్షంలోకి వెళ్ళారు. ఉదయం ప్రార్థనలతో అల్ మన్సౌరి తన పనుల్ని ప్రారంభించినట్లు మొహమ్మద్ బిన్ రషీద్ స్సేన సెంటర్ పేర్కొంది.వారం రోజుల్లో అల్ మన్సౌరి తిరిగి భూమికి చేరుకుంటారు. ఈలోగా ప్రతిరోజూ, మైక్రో గ్రావిటీ ఇంపాక్ట్ సహా అనేక అంశాలపై ప్రయోగాలు నిర్వహిస్తారు. బ్రెయిన్ డిటిఐ, ఓస్టియాలజీ, మోటార్ కంట్రోల్, మైక్రో గ్రావిటీలో టైమ్ పర్సెప్షన్, ఫ్యూయిడిక్స్, డిఎన్ఎఎమ్ ఏజ్ వంటి వాటిపైనా ఆయన ప్రయోగాలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- ఇరాన్ నుండి నష్టపరిహారం ఇప్పించండి: బహ్రెయిన్
- 10% వరకు పెరగనున్న విమాన ఛార్జీలు..!!
- కువైట్ లో రెండు రోజులపాటు భారీ వర్షాలు..!!
- సౌదీలో చట్టాలను ఉల్లంఘించిన 14,487 మంది అరెస్టు..!!
- ఇజ్రాయెల్ చర్యను ఖండించిన ఒమన్ సహా 14 దేశాలు..!!
- ఖతార్ లో అడ్మిషన్లు..20 ఇ-సేవలు ఆవిష్కరణ..!!
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!









