ఐఎస్ఎస్లో ప్రయోగాల్ని ప్రారంభించిన యూఏఈ ఆస్ట్రోనాట్
- September 27, 2019యూఏఈ:హజా అల్ మన్సూరి, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)కి చేరుకోగానే, అక్కడ తన ప్రయోగాల్ని ప్రారంభించారు. యూఏఈ టైమ్ ప్రకారం సెప్టెంబర్ 26 తెల్లవారుఝామున 2.12 నిమిషాలకు అల్ మన్సూరి ఐఎస్ఎస్ కేంద్రానికి చేరుకున్నారు. జోయుజ్ ఎంఎస్ 15 రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి వెళ్ళారాయన. రష్యన్ కాస్మోనాట్ ఒలెగ్ స్క్రిపోచ్కా, యూఎస్ ఆస్ట్రోనాట్ జెస్సికా మీర్ కూడా ఆయనతోపాటు అంతరిక్షంలోకి వెళ్ళారు. ఉదయం ప్రార్థనలతో అల్ మన్సౌరి తన పనుల్ని ప్రారంభించినట్లు మొహమ్మద్ బిన్ రషీద్ స్సేన సెంటర్ పేర్కొంది.వారం రోజుల్లో అల్ మన్సౌరి తిరిగి భూమికి చేరుకుంటారు. ఈలోగా ప్రతిరోజూ, మైక్రో గ్రావిటీ ఇంపాక్ట్ సహా అనేక అంశాలపై ప్రయోగాలు నిర్వహిస్తారు. బ్రెయిన్ డిటిఐ, ఓస్టియాలజీ, మోటార్ కంట్రోల్, మైక్రో గ్రావిటీలో టైమ్ పర్సెప్షన్, ఫ్యూయిడిక్స్, డిఎన్ఎఎమ్ ఏజ్ వంటి వాటిపైనా ఆయన ప్రయోగాలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం