ఐఎస్ఎస్లోని యూఏఈ ఆస్ట్రోనాట్తో షేక్ మొహమ్మద్ సంభాషణ
- September 27, 2019
యూఏఈ తొలి ఆస్ట్రోనాట్ హజ్జా అల్ మన్సూరి ప్రస్తుతం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో వున్నారు. సోయుజ్ రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి వెళ్ళిన హజ్జా, అక్కడే ప్రయోగాలు చేపడుతున్నారు. కాగా, హజ్జా అల్ మన్సూరితో యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ మాట్లాడారు. ఈ సందర్భంగా హజ్జా మాట్లాడుతూ, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి భూమి చాలా అందంగా కన్పిస్తోందని, దుబాయ్లోని పామ్ ఐలాండ్స్ ఇంకా అందంగా కనిపిస్తున్నాయని చెప్పారు. రాకెట్ నింగిలోకి దూసుకెళుతున్నప్పుడు ఎలా అనిపించింది.? అనడిగితే, ఆ సమయంలో చాలా ఒత్తిడిగా అనిపించిందనీ, అయితే చాలా అద్భుతమైన అనుభూతి అనీ హజ్జా చెప్పారు. అల్లాకి అలాగే షేక్ మొహమ్మద్కీ ఈ సందర్భంగా హజ్జా కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!