ఐఎస్‌ఎస్‌లోని యూఏఈ ఆస్ట్రోనాట్‌తో షేక్‌ మొహమ్మద్‌ సంభాషణ

- September 27, 2019 , by Maagulf
ఐఎస్‌ఎస్‌లోని యూఏఈ ఆస్ట్రోనాట్‌తో షేక్‌ మొహమ్మద్‌ సంభాషణ

యూఏఈ తొలి ఆస్ట్రోనాట్‌ హజ్జా అల్‌ మన్సూరి ప్రస్తుతం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో వున్నారు. సోయుజ్‌ రాకెట్‌ ద్వారా అంతరిక్షంలోకి వెళ్ళిన హజ్జా, అక్కడే ప్రయోగాలు చేపడుతున్నారు. కాగా, హజ్జా అల్‌ మన్సూరితో యూఏఈ వైస్‌ ప్రెసిడెంట్‌, ప్రైమ్‌ మినిస్టర్‌, దుబాయ్‌ రూలర్‌ షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తౌమ్‌ మాట్లాడారు. ఈ సందర్భంగా హజ్జా మాట్లాడుతూ, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి భూమి చాలా అందంగా కన్పిస్తోందని, దుబాయ్‌లోని పామ్‌ ఐలాండ్స్‌ ఇంకా అందంగా కనిపిస్తున్నాయని చెప్పారు. రాకెట్‌ నింగిలోకి దూసుకెళుతున్నప్పుడు ఎలా అనిపించింది.? అనడిగితే, ఆ సమయంలో చాలా ఒత్తిడిగా అనిపించిందనీ, అయితే చాలా అద్భుతమైన అనుభూతి అనీ హజ్జా చెప్పారు. అల్లాకి అలాగే షేక్‌ మొహమ్మద్‌కీ ఈ సందర్భంగా హజ్జా కృతజ్ఞతలు తెలిపారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com