ఐఎస్ఎస్లోని యూఏఈ ఆస్ట్రోనాట్తో షేక్ మొహమ్మద్ సంభాషణ
- September 27, 2019
యూఏఈ తొలి ఆస్ట్రోనాట్ హజ్జా అల్ మన్సూరి ప్రస్తుతం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో వున్నారు. సోయుజ్ రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి వెళ్ళిన హజ్జా, అక్కడే ప్రయోగాలు చేపడుతున్నారు. కాగా, హజ్జా అల్ మన్సూరితో యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ మాట్లాడారు. ఈ సందర్భంగా హజ్జా మాట్లాడుతూ, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి భూమి చాలా అందంగా కన్పిస్తోందని, దుబాయ్లోని పామ్ ఐలాండ్స్ ఇంకా అందంగా కనిపిస్తున్నాయని చెప్పారు. రాకెట్ నింగిలోకి దూసుకెళుతున్నప్పుడు ఎలా అనిపించింది.? అనడిగితే, ఆ సమయంలో చాలా ఒత్తిడిగా అనిపించిందనీ, అయితే చాలా అద్భుతమైన అనుభూతి అనీ హజ్జా చెప్పారు. అల్లాకి అలాగే షేక్ మొహమ్మద్కీ ఈ సందర్భంగా హజ్జా కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







