ఐఎస్ఎస్లోని యూఏఈ ఆస్ట్రోనాట్తో షేక్ మొహమ్మద్ సంభాషణ
- September 27, 2019
యూఏఈ తొలి ఆస్ట్రోనాట్ హజ్జా అల్ మన్సూరి ప్రస్తుతం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో వున్నారు. సోయుజ్ రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి వెళ్ళిన హజ్జా, అక్కడే ప్రయోగాలు చేపడుతున్నారు. కాగా, హజ్జా అల్ మన్సూరితో యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ మాట్లాడారు. ఈ సందర్భంగా హజ్జా మాట్లాడుతూ, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి భూమి చాలా అందంగా కన్పిస్తోందని, దుబాయ్లోని పామ్ ఐలాండ్స్ ఇంకా అందంగా కనిపిస్తున్నాయని చెప్పారు. రాకెట్ నింగిలోకి దూసుకెళుతున్నప్పుడు ఎలా అనిపించింది.? అనడిగితే, ఆ సమయంలో చాలా ఒత్తిడిగా అనిపించిందనీ, అయితే చాలా అద్భుతమైన అనుభూతి అనీ హజ్జా చెప్పారు. అల్లాకి అలాగే షేక్ మొహమ్మద్కీ ఈ సందర్భంగా హజ్జా కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ
- ఖైతాన్–ఎయిర్పోర్ట్ రోడ్ జంక్షన్ తాత్కాలిక మూసివేత..!!
- ఒమన్ చేరుకున్న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్..!!
- ఇరాన్ దాడులు.. అంతర్జాతీయ జోక్యానికి బహ్రెయిన్ పిలుపు..!!
- జీవన నాణ్యత సూచీలో మెరిసిన ఖతార్.. భారీ పురోగతి..!!
- ఎతిహాద్ రైలు ప్రయాణికులకు బంపరాఫర్.. 25% వరకు ప్రత్యేక తగ్గింపులు..!!
- 'ఏషియా మెడికల్ సిటీ' ప్రాజెక్టుకు అనుమతి లేదు: సౌదీ
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్







