మలేసియా నుండి కోమా పేషేంటును ఇప్పుడే పంపలేము:భారత రాయబార కార్యాలయం

- October 01, 2019 , by Maagulf
మలేసియా నుండి కోమా పేషేంటును ఇప్పుడే పంపలేము:భారత రాయబార కార్యాలయం

మలేషియా:జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తాళ్ల ధర్మారం గ్రామానికి చెందిన తట్ర రాజం అనే యువకునికి మలేసియాలో పనిప్రదేశంలో తలకు దెబ్బ తగిలి కోమాలోకి (అపస్మారక స్థితి) లో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

 అతనికి మెరుగైన వైద్యం అందించి స్వదేశానికి పంపించాలని ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరం అధ్యక్షులు మంద భీంరెడ్ది మలేసియా రాజధాని కౌలాలంపూర్ లోని ఇండియన్ హైకమీషన్ కు ఇ-మెయిల్ ద్వారా, ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. ఈమేరకు మలేషియాలోని భారత దౌత్యాధికారులు లక్ష్మీకాంత్ కుంబర్, నిషిత్ కుమార్ ఉజ్వల్ లు స్పందించి మంగళవారం (01.10.2019) భీంరెడ్డికి జవాబు ఇచ్చారు.

కోమాలో ఉన్న పేషేంటు ప్రస్తుత స్థితి ప్రయాణానికి అనువుగాలేదని ఆసుపత్రివారు తెలిపారని, ఇదే విషయాన్ని స్థానికి తెలుగు సంఘం ద్వారా ఇండియాలో ఉన్న కుటుంబ సభ్యులకు తెలియపర్చామని దౌత్యాధికారులు వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com