పాక్ కోసం యుద్ధ నౌక తయారుచేస్తున్న టర్కీ
- October 02, 2019
టర్కీ: గత ఏడాది కుదిరిన ఒప్పందంలో భాగంగా పాకిస్తాన్కు అమ్మేందుకు టర్కీ ఒక యుద్ధ నౌక నిర్మాణాన్ని ప్రారంభించింది. పాక్కు అమ్మే యుద్ధ నౌకకు మిల్జెమ్ అనే పేరు పెట్టారు. ఈ యుద్ధనౌక నిర్మాణం ప్రారంభించిన సందర్భంగా జరిగిన ఒక కార్యక్రమంలో టర్కీ అధ్యక్షుడు రిసెప్ తయ్యిప్ ఎర్డోగన్ పాల్గొన్నారు. టర్కీ నిర్మిస్తున్న ఈ యుద్ధ నౌక వల్ల పాకిస్తాన్కు మంచి ప్రయోజనం చేకూరగలదని ఆశిస్తున్నట్లు అధ్యక్షుడు పేర్కొన్నట్లు అక్కడి పత్రికలు తెలిపాయి. ఈ కార్యక్రమంలో పాకిస్తాన్ నేవీ కమాండర్ అడ్మిరల్ జాఫర్ మహమూద్ అబ్బాసీ కూడా పాల్గొన్నారు. మిల్జెమ్ యుద్ధ నౌక పొడవు 99 మీటర్లు ఉంటుంది. 24,000 టన్నుల బరువును మోయగల సామర్ధ్యం ఉన్న ఈ యుద్ధనౌక గంటకు 29 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణించగలదు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







