పాక్ కోసం యుద్ధ నౌక తయారుచేస్తున్న టర్కీ
- October 02, 2019టర్కీ: గత ఏడాది కుదిరిన ఒప్పందంలో భాగంగా పాకిస్తాన్కు అమ్మేందుకు టర్కీ ఒక యుద్ధ నౌక నిర్మాణాన్ని ప్రారంభించింది. పాక్కు అమ్మే యుద్ధ నౌకకు మిల్జెమ్ అనే పేరు పెట్టారు. ఈ యుద్ధనౌక నిర్మాణం ప్రారంభించిన సందర్భంగా జరిగిన ఒక కార్యక్రమంలో టర్కీ అధ్యక్షుడు రిసెప్ తయ్యిప్ ఎర్డోగన్ పాల్గొన్నారు. టర్కీ నిర్మిస్తున్న ఈ యుద్ధ నౌక వల్ల పాకిస్తాన్కు మంచి ప్రయోజనం చేకూరగలదని ఆశిస్తున్నట్లు అధ్యక్షుడు పేర్కొన్నట్లు అక్కడి పత్రికలు తెలిపాయి. ఈ కార్యక్రమంలో పాకిస్తాన్ నేవీ కమాండర్ అడ్మిరల్ జాఫర్ మహమూద్ అబ్బాసీ కూడా పాల్గొన్నారు. మిల్జెమ్ యుద్ధ నౌక పొడవు 99 మీటర్లు ఉంటుంది. 24,000 టన్నుల బరువును మోయగల సామర్ధ్యం ఉన్న ఈ యుద్ధనౌక గంటకు 29 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణించగలదు.
తాజా వార్తలు
- తెలంగాణలోని 10 వర్సిటీలకు ఇన్ఛార్జి వీసీల నియామకం
- సింగపూర్ విమానంలో భారీ కుదుపులు...ఒకరి మృతి
- అమెరికా కోర్టు న్యాయమూర్తిగా తెలుగు మహిళ జయ బాడిగ
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మృతి..భారత్ సంతాపం
- ఆ రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు: బెంగళూరు పోలీస్ కమిషనర్
- జూన్ 1 నుండి సింగిల్ యూజ్ స్టైరోఫోమ్ ఉత్పత్తుల బ్యాన్
- ప్రస్తుత ట్రాఫిక్ రికార్డును బద్దలు కొట్టనున్న DXB..!
- నకిలీ వెబ్సైట్ల గురించి పోలీసుల హెచ్చరిక
- మధుమేహం ఉన్న పిల్లలకు గ్లూకోజ్ సెన్సార్లు, ఇన్సులిన్ పంపిణీ
- మే 24 - జూన్ 26 మధ్య హజ్ అనుమతి ఉంటేనే ఉమ్రా..!