పాక్ కోసం యుద్ధ నౌక తయారుచేస్తున్న టర్కీ
- October 02, 2019
టర్కీ: గత ఏడాది కుదిరిన ఒప్పందంలో భాగంగా పాకిస్తాన్కు అమ్మేందుకు టర్కీ ఒక యుద్ధ నౌక నిర్మాణాన్ని ప్రారంభించింది. పాక్కు అమ్మే యుద్ధ నౌకకు మిల్జెమ్ అనే పేరు పెట్టారు. ఈ యుద్ధనౌక నిర్మాణం ప్రారంభించిన సందర్భంగా జరిగిన ఒక కార్యక్రమంలో టర్కీ అధ్యక్షుడు రిసెప్ తయ్యిప్ ఎర్డోగన్ పాల్గొన్నారు. టర్కీ నిర్మిస్తున్న ఈ యుద్ధ నౌక వల్ల పాకిస్తాన్కు మంచి ప్రయోజనం చేకూరగలదని ఆశిస్తున్నట్లు అధ్యక్షుడు పేర్కొన్నట్లు అక్కడి పత్రికలు తెలిపాయి. ఈ కార్యక్రమంలో పాకిస్తాన్ నేవీ కమాండర్ అడ్మిరల్ జాఫర్ మహమూద్ అబ్బాసీ కూడా పాల్గొన్నారు. మిల్జెమ్ యుద్ధ నౌక పొడవు 99 మీటర్లు ఉంటుంది. 24,000 టన్నుల బరువును మోయగల సామర్ధ్యం ఉన్న ఈ యుద్ధనౌక గంటకు 29 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణించగలదు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







