భూమికి తిరిగిరానున్న యూఏఈ తొలి ఆస్ట్రోనాట్
- October 02, 2019యూఏఈ తొలి ఆస్ట్రోనాట్ హజ్జా అల్మన్సూరి, విజయవంతంగా అంతరిక్ష యాత్ర పూర్తి చేసుకుని భూమికి తిరిగిరానున్నారు. అక్టోబర్ 3 మధ్యాహ్నం 2.59 నిమిషాలకు (యూఏఈ టైమ్) హజ్జా అల్ మన్సూరి భూమికి చేరుకుంటారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళి అక్కడే వారం రోజులపాటు అనేక ప్రయోగాలు నిర్వహించారు హజ్జా. సోయజ్ స్పేస్ క్రాఫ్ట్కి సంబంధించిన మాడ్యూల్ ద్వారా హజ్జాతోపాటు ఆన్బోర్డ్ సభ్యులు భూమికి చేరుకుంటారు. అనంతరం వారిని హెలికాప్టర్ ద్వారా కరంగద సిటీకి తరలిస్తారు. అక్కడి నుంచి వారిని మాస్కోకి పంపిస్తారు. వైద్య పరీక్షల అనంతరం.. ఆస్ట్రోనాట్స్ తమ తమ స్వస్థలాలకు చేరుకోనున్నారని అధికారులు వివరించారు. అల్మన్సూరితోపాటు నాసా ఆస్ట్రోనాట్ నిక్ హేగ్, రష్యన్ కాస్మోనాట్ అలెక్సీ ఓవచినిన్ భూమికి తిరిగి వస్తున్నారు.
తాజా వార్తలు
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు