భూమికి తిరిగిరానున్న యూఏఈ తొలి ఆస్ట్రోనాట్
- October 02, 2019
యూఏఈ తొలి ఆస్ట్రోనాట్ హజ్జా అల్మన్సూరి, విజయవంతంగా అంతరిక్ష యాత్ర పూర్తి చేసుకుని భూమికి తిరిగిరానున్నారు. అక్టోబర్ 3 మధ్యాహ్నం 2.59 నిమిషాలకు (యూఏఈ టైమ్) హజ్జా అల్ మన్సూరి భూమికి చేరుకుంటారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళి అక్కడే వారం రోజులపాటు అనేక ప్రయోగాలు నిర్వహించారు హజ్జా. సోయజ్ స్పేస్ క్రాఫ్ట్కి సంబంధించిన మాడ్యూల్ ద్వారా హజ్జాతోపాటు ఆన్బోర్డ్ సభ్యులు భూమికి చేరుకుంటారు. అనంతరం వారిని హెలికాప్టర్ ద్వారా కరంగద సిటీకి తరలిస్తారు. అక్కడి నుంచి వారిని మాస్కోకి పంపిస్తారు. వైద్య పరీక్షల అనంతరం.. ఆస్ట్రోనాట్స్ తమ తమ స్వస్థలాలకు చేరుకోనున్నారని అధికారులు వివరించారు. అల్మన్సూరితోపాటు నాసా ఆస్ట్రోనాట్ నిక్ హేగ్, రష్యన్ కాస్మోనాట్ అలెక్సీ ఓవచినిన్ భూమికి తిరిగి వస్తున్నారు.
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







