భూమికి తిరిగిరానున్న యూఏఈ తొలి ఆస్ట్రోనాట్
- October 02, 2019
యూఏఈ తొలి ఆస్ట్రోనాట్ హజ్జా అల్మన్సూరి, విజయవంతంగా అంతరిక్ష యాత్ర పూర్తి చేసుకుని భూమికి తిరిగిరానున్నారు. అక్టోబర్ 3 మధ్యాహ్నం 2.59 నిమిషాలకు (యూఏఈ టైమ్) హజ్జా అల్ మన్సూరి భూమికి చేరుకుంటారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళి అక్కడే వారం రోజులపాటు అనేక ప్రయోగాలు నిర్వహించారు హజ్జా. సోయజ్ స్పేస్ క్రాఫ్ట్కి సంబంధించిన మాడ్యూల్ ద్వారా హజ్జాతోపాటు ఆన్బోర్డ్ సభ్యులు భూమికి చేరుకుంటారు. అనంతరం వారిని హెలికాప్టర్ ద్వారా కరంగద సిటీకి తరలిస్తారు. అక్కడి నుంచి వారిని మాస్కోకి పంపిస్తారు. వైద్య పరీక్షల అనంతరం.. ఆస్ట్రోనాట్స్ తమ తమ స్వస్థలాలకు చేరుకోనున్నారని అధికారులు వివరించారు. అల్మన్సూరితోపాటు నాసా ఆస్ట్రోనాట్ నిక్ హేగ్, రష్యన్ కాస్మోనాట్ అలెక్సీ ఓవచినిన్ భూమికి తిరిగి వస్తున్నారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







