మహాత్మాగాంధీకి భారత వలసదారుల నివాళులు

- October 02, 2019 , by Maagulf
మహాత్మాగాంధీకి భారత వలసదారుల నివాళులు

దుబాయ్: వందలాది మంది భారతీయ వలసదారులు యూఏఈలో మహాత్మాగాంధీకి ఘనంగా నివాళులర్పించారు. మహాత్మాగాంధీ 150వ జయంతి కారణంగా దుబాయ్‌లోని జబీల్‌ పార్క్‌ వద్ద పీస్‌ ఆఫ్‌ టోలరెన్స్‌ వాక్‌ పేరుతో ఓ కార్యక్రమం చేపట్టారు. 4 కిలోమీటర్ల మేర జరిగిన పీస్‌ వాక్‌లో దుబాయ్‌లోని భారత కాన్సులర్‌ అయిన విపుల్‌ పాల్గొన్నారు. గాంధీ మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని ఈ సందర్భంగా వక్తలు అభిప్రాయపడ్డారు. స్వచ్ఛత, అహింస వంటి గాంధేయ మార్గాల్ని అనుసరిస్తే మానవాళికి ఎంతో మంచిదని ఆయన చెప్పారు. కాన్సులేట్‌, 100 ఫొటోలతో కూడిన ఫొటో ఎగ్జిబిషన్‌ని ఏర్పాటు చేసింది. మహాత్మాగాంధీకి సంబంధించిన పొటోలు ఇందులో వున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com