మహాత్మాగాంధీకి భారత వలసదారుల నివాళులు
- October 02, 2019దుబాయ్: వందలాది మంది భారతీయ వలసదారులు యూఏఈలో మహాత్మాగాంధీకి ఘనంగా నివాళులర్పించారు. మహాత్మాగాంధీ 150వ జయంతి కారణంగా దుబాయ్లోని జబీల్ పార్క్ వద్ద పీస్ ఆఫ్ టోలరెన్స్ వాక్ పేరుతో ఓ కార్యక్రమం చేపట్టారు. 4 కిలోమీటర్ల మేర జరిగిన పీస్ వాక్లో దుబాయ్లోని భారత కాన్సులర్ అయిన విపుల్ పాల్గొన్నారు. గాంధీ మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని ఈ సందర్భంగా వక్తలు అభిప్రాయపడ్డారు. స్వచ్ఛత, అహింస వంటి గాంధేయ మార్గాల్ని అనుసరిస్తే మానవాళికి ఎంతో మంచిదని ఆయన చెప్పారు. కాన్సులేట్, 100 ఫొటోలతో కూడిన ఫొటో ఎగ్జిబిషన్ని ఏర్పాటు చేసింది. మహాత్మాగాంధీకి సంబంధించిన పొటోలు ఇందులో వున్నాయి.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం