సౌదీ అరేబియాలో విద్యుదాఘాతంతో కేరళ యువకుడు మృతి

- October 04, 2019 , by Maagulf
సౌదీ అరేబియాలో విద్యుదాఘాతంతో కేరళ యువకుడు మృతి

సౌదీ అరేబియా:సౌదీ అరేబియాలోని జెడ్డా నగరంలో కేరళ యువకుడు విద్యుదాఘాతంతో మృతి చెందాడు. కేరళలోని మలప్పురం జిల్లా వాసి ఇషాఖాలి మెలేదాత్(30) జెడ్డాలో ఎలక్ట్రిషియన్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో విధుల్లో ఉండగా ఇషాఖాలి ప్రమాదవశాత్తు కరెంట్ షాక్‌కు గురయ్యాడు. దీంతో అతడు అక్కడికక్కడే చనిపోయాడు. అతడి మరణ వార్త తెలుసుకున్న జెడ్డా కేఎంసీసీ సంక్షేమ విభాగం నేతలు ముహ్మద్ కుటీ పనాకద్, జలీల్ ఒఝుకుర్ వెంటనే ఘటనాస్థలికి వెళ్లి అతడి మృతదేహాన్ని సొంతూరికి పంపించే ఏర్పాట్లు చేశారు. మృతుడికి భార్య అమ్నా, కొడుకు అమిన్ షాన్ ఉన్నారు. ఇషాఖాలి మృతితో వారు కన్నీరుమున్నీరవుతున్నారు. అతడి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com