సౌదీ అరేబియాలో విద్యుదాఘాతంతో కేరళ యువకుడు మృతి
- October 04, 2019
సౌదీ అరేబియా:సౌదీ అరేబియాలోని జెడ్డా నగరంలో కేరళ యువకుడు విద్యుదాఘాతంతో మృతి చెందాడు. కేరళలోని మలప్పురం జిల్లా వాసి ఇషాఖాలి మెలేదాత్(30) జెడ్డాలో ఎలక్ట్రిషియన్గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో విధుల్లో ఉండగా ఇషాఖాలి ప్రమాదవశాత్తు కరెంట్ షాక్కు గురయ్యాడు. దీంతో అతడు అక్కడికక్కడే చనిపోయాడు. అతడి మరణ వార్త తెలుసుకున్న జెడ్డా కేఎంసీసీ సంక్షేమ విభాగం నేతలు ముహ్మద్ కుటీ పనాకద్, జలీల్ ఒఝుకుర్ వెంటనే ఘటనాస్థలికి వెళ్లి అతడి మృతదేహాన్ని సొంతూరికి పంపించే ఏర్పాట్లు చేశారు. మృతుడికి భార్య అమ్నా, కొడుకు అమిన్ షాన్ ఉన్నారు. ఇషాఖాలి మృతితో వారు కన్నీరుమున్నీరవుతున్నారు. అతడి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







