అప్పుల్లో కూరుకుపోయిన పాకిస్తాన్
- October 09, 2019పాకిస్థాన్ అప్పులు అమాంతం పెరిగిపోతున్నాయి. దేశం అప్పుల కుప్పగా మారిందని పలు నివేదికలు వెల్లడించాయి. స్టేట్ బ్యాంక్ డేటా ప్రకారం ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ వచ్చిన ఏడాదిలోపే పాకిస్థాన్ 7లక్షల కోట్ల అప్పు తెచ్చింది.
గతంలో ఎన్నడూ కూడా ఒకే ఏడాది ఈస్థాయిలో అప్పు తీసుకురాలేదు. ఈ ఏడు లక్షల కోట్ల అప్పులో 2.8 లక్షల కోట్ల విదేశాల నుంచి తీసుకుంది. మిగిలిన అప్పును స్వదేశంలోనే సేకరించింది పాక్ ప్రభుత్వం.
ప్రస్తుతం పాకిస్థాన్ మొత్తం అప్పు రూ. 32 లక్షల 24వేల కోట్లకు చేరింది. ఇమ్రాన్ అధికార పగ్గాలు స్వీకరించకముందు పాక్ అప్పు 24 లక్షల 73వేల కోట్లుగా ఉండేది. అయితే పన్నుల వసూలులో మాత్రం పాకిస్థాన్ అనుకున్న లక్ష్యానికి దగ్గరగా రాగలిగింది. ఈ ఏడాది తొలి ఆర్థిక త్రైమాసకానికి లక్ష కోట్ల మేర పన్నుల వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా. 96వేల కోట్లను వసూలు చేసింది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ