అప్పుల్లో కూరుకుపోయిన పాకిస్తాన్
- October 09, 2019
పాకిస్థాన్ అప్పులు అమాంతం పెరిగిపోతున్నాయి. దేశం అప్పుల కుప్పగా మారిందని పలు నివేదికలు వెల్లడించాయి. స్టేట్ బ్యాంక్ డేటా ప్రకారం ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ వచ్చిన ఏడాదిలోపే పాకిస్థాన్ 7లక్షల కోట్ల అప్పు తెచ్చింది.
గతంలో ఎన్నడూ కూడా ఒకే ఏడాది ఈస్థాయిలో అప్పు తీసుకురాలేదు. ఈ ఏడు లక్షల కోట్ల అప్పులో 2.8 లక్షల కోట్ల విదేశాల నుంచి తీసుకుంది. మిగిలిన అప్పును స్వదేశంలోనే సేకరించింది పాక్ ప్రభుత్వం.
ప్రస్తుతం పాకిస్థాన్ మొత్తం అప్పు రూ. 32 లక్షల 24వేల కోట్లకు చేరింది. ఇమ్రాన్ అధికార పగ్గాలు స్వీకరించకముందు పాక్ అప్పు 24 లక్షల 73వేల కోట్లుగా ఉండేది. అయితే పన్నుల వసూలులో మాత్రం పాకిస్థాన్ అనుకున్న లక్ష్యానికి దగ్గరగా రాగలిగింది. ఈ ఏడాది తొలి ఆర్థిక త్రైమాసకానికి లక్ష కోట్ల మేర పన్నుల వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా. 96వేల కోట్లను వసూలు చేసింది.
తాజా వార్తలు
- ఖైతాన్–ఎయిర్పోర్ట్ రోడ్ జంక్షన్ తాత్కాలిక మూసివేత..!!
- ఒమన్ చేరుకున్న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్..!!
- ఇరాన్ దాడులు.. అంతర్జాతీయ జోక్యానికి బహ్రెయిన్ పిలుపు..!!
- జీవన నాణ్యత సూచీలో మెరిసిన ఖతార్.. భారీ పురోగతి..!!
- ఎతిహాద్ రైలు ప్రయాణికులకు బంపరాఫర్.. 25% వరకు ప్రత్యేక తగ్గింపులు..!!
- 'ఏషియా మెడికల్ సిటీ' ప్రాజెక్టుకు అనుమతి లేదు: సౌదీ
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు







