రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

- October 10, 2019 , by Maagulf
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

యూఏఈ: అతి వేగంగా దూసుకొచ్చిన ఓ వాహనం ఇద్దర్ని బలిగొంది. అతి వేగం కారణంగా కారు ఓవర్‌ టర్న్‌ అవడంతో ప్రమాదం చోటు చేసుకున్నట్లు ప్రమాద ఘటనపై పోలీసులు వివరించారు. ఆపరేషన్స్‌ రూమ్‌ ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందుకోగానే ట్రాఫిక్‌ పెట్రోల్‌ మరియు అంబులెన్సెస్‌ ప్రమాద స్థలికి చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. వాహనాన్ని నడుపుతున్న వ్యక్తి యూఏఈ జాతీయుడు కాగా, రోడ్డుపై నడుచుకుంటూ వెళుతూ ఈ కారు ప్రమాదానికి గురైన వ్యక్తిని పాకిస్తానీ జాతీయుడిగా గుర్తించారు. 18 ఏళ్ళ డ్రైవర్‌ సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోగా, 44 ఏళ్ళ వర్కర్‌, ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో ప్రాణాలు కోల్పోయాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com