లేన్ ఛేంజ్ ఉల్లంఘనలు: 4,000 మందికి పైగా డ్రైవర్స్కి జరీమానా
- October 14, 2019
యూ.ఏ.ఈ:4000 మందికి పైగా మోటరిస్టులకు లేన్ ఛేంజ్ ఉల్లంఘనల నేపథ్యంలో ఒక్కొక్కరికి 400 దిర్హామ్ల జరీమానా గత ఎనిమిది నెలల్లో విధించినట్లు ట్రాఫిక్ అథారిటీస్ వెల్లడించాయి. అబుదాబీ ట్రాఫిక్ అండ్ పెట్రోల్స్ డైరెక్టరేట్ వెల్లడించిన వివరాల ప్రకారం మొత్తం 4,311 ఉల్లంఘనలు రికార్డ్ అయినట్లు తెలుస్తోంది. ఇండికేటర్స్ వినియోగించకుండా వున్నపళంగా లేన్ ఛేంజ్ చేసిన డ్రైవర్లకు ఈ జరీమానాలు విధించారు. ఈ కారణంగా అబుదాబీ రోడ్లపై 235 రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఓ వ్యక్తి మృతి చెందగా ఆరుగురు గాయపడ్డారు కూడా. ఇదిలా వుంటే, గత ఏడాది లేన్ ఛేంజింగ్ ఉల్లంఘనలు 17,349 వరకు నమోదయ్యాయి.
తాజా వార్తలు
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో 'దిస్ ఈస్ యువర్ రోల్' ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..