ఖర్జూరాన్ని పాలల్లో నానబెట్టి తింటే బాగా నిద్రపడుతుంది
- October 16, 2019
ఖర్జూరాలను తీసుకోవడం వల్ల ఆరోగ్యపరంగా చాలా లాభాలు ఉన్నాయి. వీటిల్లో కొలెస్ట్రాల్ ఉండదు. అలాగే కొవ్వు శాతం కూడా తక్కువే. పైగా తక్షణ శక్తి లభిస్తుంది. ఇవి ఇంకెలా మేలు చేస్తాయంటే..
ఖర్జూరాల్లో పొటాషియం, క్యాల్షియం ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఆ పోషకాలు ఎముకలను మేలు చేస్తాయి. చెడు కొలస్ట్రాల్ను తగ్గిస్తాయి. అసిడిటీని అదుపులో ఉంచుతాయి. వీటిల్లోని పీచు అరుగుదలకు సాయపడుతుంది. ఖర్జూరాన్ని పాలల్లో నానబెట్టి తింటే చక్కగా నిద్రపడుతుంది.
ఎండు ఖర్జూరాలను రాత్రంతా నానబెట్టి ఉదయం ఏవైనా పండ్లతోపాటు తీసుకుంటే మలబద్ధకం సమస్య దరిచేరదు. బరువు పెరగాలనుకునే వారికి ఇది చక్కటి ఆహారం. వీటిలో ఇనుము శాతం కూడా ఎక్కువే. క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తహీనత దరిచేరదు.
విటమిన్లు, ఖనిజాలు మాంసకృత్తులు ఖర్జూరాల్లో సమృద్ధిగా లభిస్తాయి. రోజూ కనీసం నాలుగైదు తీసుకోవాలి. తీసుకున్న వెంటనే తక్షణ శక్తి అందుతుంది. అలసట దూరమవుతుంది. అందుకు ఖర్జూరాల్లోని గ్లూకోజ్, సుక్రోజ్, ఫ్రక్టోజ్లు కారణం.
తాజా వార్తలు
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!







