తెలంగాణలో పరిస్థితిని మోదీ కి వివరించిన గవర్నర్
- October 16, 2019
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీతో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రధాని మోదీతో తమిళిసై భేటీ అవడం ఇదే తొలిసారి. దాదాపు అరగంట పాటు మోదీతో భేటీ అయిన గవర్నర్.. దేశం దృష్టిని ఆకర్షించేలా తెలంగాణలో గత 11 రోజులుగా జరుగుతున్న టీఎస్ఆర్టీసి సమ్మె గురించి, సమ్మె అనంతరం రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న తాజా పరిణామాల గురించి వివరించారు.
ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోనూ గవర్నర్ తమిళిసై భేటీ అయ్యారు. తెలంగాణలో సమ్మె తర్వాతి పరిస్థితులు, ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు, శాంతి భద్రతలు వంటి అంశాలు చర్చకొచ్చినట్టు తెలిసింది.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







