తెలంగాణలో పరిస్థితిని మోదీ కి వివరించిన గవర్నర్
- October 16, 2019ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీతో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రధాని మోదీతో తమిళిసై భేటీ అవడం ఇదే తొలిసారి. దాదాపు అరగంట పాటు మోదీతో భేటీ అయిన గవర్నర్.. దేశం దృష్టిని ఆకర్షించేలా తెలంగాణలో గత 11 రోజులుగా జరుగుతున్న టీఎస్ఆర్టీసి సమ్మె గురించి, సమ్మె అనంతరం రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న తాజా పరిణామాల గురించి వివరించారు.
ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోనూ గవర్నర్ తమిళిసై భేటీ అయ్యారు. తెలంగాణలో సమ్మె తర్వాతి పరిస్థితులు, ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు, శాంతి భద్రతలు వంటి అంశాలు చర్చకొచ్చినట్టు తెలిసింది.
తాజా వార్తలు
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు
- ఇకపై 'వ్యాక్సినేషన్ స్టేటస్' ఉండదు..!
- గ్రీన్ టెక్నాలజీ పై SAS 48 హ్యాకథాన్ ప్రారంభం
- మే 13న నాలుగో విడత పోలింగ్..