దుబాయ్ లో దైవసేవకురాలు (నర్సాపురం వాసి ) హఠాన్మరణం

- October 20, 2019 , by Maagulf
దుబాయ్ లో దైవసేవకురాలు (నర్సాపురం వాసి ) హఠాన్మరణం

దుబాయ్ లో ఒక ప్రైవేట్ కార్యక్రమం లో పాల్గొనేందుకు వచ్చిన ఒక మహిళా దైవసేవకురాలు  గుండెపోటు తో హఠాన్మరణం చెందిన సంఘటన ఇటీవల జరిగింది. ఆంధ్రప్రదేశ్ లోని నర్సాపురం యలమంచిలి కి చెందిన మధుర సత్యావతి  శుక్రవారం తన భర్త వినయ భూషణం తో కలిసి విజిట్ వీసా లో దుబాయ్ కి వచ్చారు. మంగళవారం ఆకస్మికంగా గుండెనొప్పి రావడంతో వెంటనే హుటాహుటిన ప్రభుత్వ దుబాయ్ హాస్పిటల్ కి తీసుకువెళ్లారు. అప్పటికే ఆమె మార్గమధ్యంలో మృతి చెందారని డాక్టర్లు ధృవీకరించారు. అయితే సాధారణంగా మృతదేహాన్ని ఇండియా కి తరలించడం చాల క్లిష్టమైన ప్రక్రియ. దుబాయ్ చట్టాల ప్రకారం అనేక లాంఛనాలు ఉంటాయి. అయితే ఇక్కడి తెలుగు న్యాయవాది షాలేంబాబు చొరవతీసుకుని చాకచక్యంగా అన్ని లాంఛనాలు త్వరితగతిన కేవలం రెండు రోజుల్లోనే పూర్తిచేయడంతో ఆమె పార్ధివదేహాన్ని విమానంలో ఇండియా కి తరలించారు.

 మధుర సత్యావతి దైవ సేవకురాలిగాను ఆమె భర్త పాస్టర్ గా పశ్చిమ గోదావరి జిల్లాలో సేవ చేస్తున్నారు.ఆమె మృతికి దుబాయ్ లోని తెలుగు క్రిస్టియన్ సంఘాలు నివాళులర్పించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com