దుబాయ్ లో దైవసేవకురాలు (నర్సాపురం వాసి ) హఠాన్మరణం
- October 20, 2019దుబాయ్ లో ఒక ప్రైవేట్ కార్యక్రమం లో పాల్గొనేందుకు వచ్చిన ఒక మహిళా దైవసేవకురాలు గుండెపోటు తో హఠాన్మరణం చెందిన సంఘటన ఇటీవల జరిగింది. ఆంధ్రప్రదేశ్ లోని నర్సాపురం యలమంచిలి కి చెందిన మధుర సత్యావతి శుక్రవారం తన భర్త వినయ భూషణం తో కలిసి విజిట్ వీసా లో దుబాయ్ కి వచ్చారు. మంగళవారం ఆకస్మికంగా గుండెనొప్పి రావడంతో వెంటనే హుటాహుటిన ప్రభుత్వ దుబాయ్ హాస్పిటల్ కి తీసుకువెళ్లారు. అప్పటికే ఆమె మార్గమధ్యంలో మృతి చెందారని డాక్టర్లు ధృవీకరించారు. అయితే సాధారణంగా మృతదేహాన్ని ఇండియా కి తరలించడం చాల క్లిష్టమైన ప్రక్రియ. దుబాయ్ చట్టాల ప్రకారం అనేక లాంఛనాలు ఉంటాయి. అయితే ఇక్కడి తెలుగు న్యాయవాది షాలేంబాబు చొరవతీసుకుని చాకచక్యంగా అన్ని లాంఛనాలు త్వరితగతిన కేవలం రెండు రోజుల్లోనే పూర్తిచేయడంతో ఆమె పార్ధివదేహాన్ని విమానంలో ఇండియా కి తరలించారు.
మధుర సత్యావతి దైవ సేవకురాలిగాను ఆమె భర్త పాస్టర్ గా పశ్చిమ గోదావరి జిల్లాలో సేవ చేస్తున్నారు.ఆమె మృతికి దుబాయ్ లోని తెలుగు క్రిస్టియన్ సంఘాలు నివాళులర్పించారు.
తాజా వార్తలు
- భారత యాత్రికులను స్వాగతించిన సౌదీ మంత్రి
- కారు మరమ్మతుల కోసం 2 నెలల నిరీక్షణ..!
- నకిలీ వస్తువుల విక్రయం కేసు.. వ్యాపారి నిర్దోషి
- బిగ్ టికెట్ రాఫిల్.. తదుపరి డ్రా జూన్ 3న
- నకిలీ వెబ్సైట్ల గురించి PACI హెచ్చరిక
- ఇండియాలో చిక్కుకుపోయిన ఒమన్ వాసులు..!
- రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్న మెగాస్టార్ చిరంజీవి
- ఎయిరిండియా సిబ్బంది మూకుమ్మడిగా సెలవు..
- జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్దొద్దు: కోర్టును కోరిన సీబీఐ
- ఒమన్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్లకు మంచి రోజులు..!