దుబాయ్ లో దైవసేవకురాలు (నర్సాపురం వాసి ) హఠాన్మరణం
- October 20, 2019
దుబాయ్ లో ఒక ప్రైవేట్ కార్యక్రమం లో పాల్గొనేందుకు వచ్చిన ఒక మహిళా దైవసేవకురాలు గుండెపోటు తో హఠాన్మరణం చెందిన సంఘటన ఇటీవల జరిగింది. ఆంధ్రప్రదేశ్ లోని నర్సాపురం యలమంచిలి కి చెందిన మధుర సత్యావతి శుక్రవారం తన భర్త వినయ భూషణం తో కలిసి విజిట్ వీసా లో దుబాయ్ కి వచ్చారు. మంగళవారం ఆకస్మికంగా గుండెనొప్పి రావడంతో వెంటనే హుటాహుటిన ప్రభుత్వ దుబాయ్ హాస్పిటల్ కి తీసుకువెళ్లారు. అప్పటికే ఆమె మార్గమధ్యంలో మృతి చెందారని డాక్టర్లు ధృవీకరించారు. అయితే సాధారణంగా మృతదేహాన్ని ఇండియా కి తరలించడం చాల క్లిష్టమైన ప్రక్రియ. దుబాయ్ చట్టాల ప్రకారం అనేక లాంఛనాలు ఉంటాయి. అయితే ఇక్కడి తెలుగు న్యాయవాది షాలేంబాబు చొరవతీసుకుని చాకచక్యంగా అన్ని లాంఛనాలు త్వరితగతిన కేవలం రెండు రోజుల్లోనే పూర్తిచేయడంతో ఆమె పార్ధివదేహాన్ని విమానంలో ఇండియా కి తరలించారు.
మధుర సత్యావతి దైవ సేవకురాలిగాను ఆమె భర్త పాస్టర్ గా పశ్చిమ గోదావరి జిల్లాలో సేవ చేస్తున్నారు.ఆమె మృతికి దుబాయ్ లోని తెలుగు క్రిస్టియన్ సంఘాలు నివాళులర్పించారు.
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







