అబుదాబీ టోల్: జరీమానాలపై 25 శాతం డిస్కౌంట్
- October 21, 2019
డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ - అబుదాబీ, టోల్ గేట్స్ దగ్గర నమోదవుతున్న జరీమానాలపై 25 శాతం డిస్కౌంట్ని ప్రకటించింది. 30 రోజుల్లోగా చెల్లించేవారికి ఈ తగ్గింపు వర్తిస్తుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఛైర్మన్ షేక్ తాయెబ్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఈ మేరకు డెసిషన్ని జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి రానున్న టోల్గేట్స్కి సంబంధించి కొన్ని వెసులుబాట్లు రాబోతున్నాయనీ, జనవరి 1 వరకు ఎలాంటి ఛార్జీలూ వసూలు వాహనాలకి వసూలు చేయబడవనీ ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం వున్న డైలీ క్యాప్ 16 దిర్హామ్స్కి అదనంగా, మంత్లీ లిమిట్ని ఇంట్రడ్యూస్ చేశారు. మోటరిస్ట్ తన తొలి వాహనానికి 200 దిర్హామ్లు చెల్లిస్తే సరిపోతుంది. రెండో వాహనానికి 150 దిర్హామ్లు, ప్రతి అదనపు వాహనానికి 100 దిర్హామ్లు చెల్లించాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్బోర్డ్పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







