అబుదాబీ టోల్: జరీమానాలపై 25 శాతం డిస్కౌంట్
- October 21, 2019
డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ - అబుదాబీ, టోల్ గేట్స్ దగ్గర నమోదవుతున్న జరీమానాలపై 25 శాతం డిస్కౌంట్ని ప్రకటించింది. 30 రోజుల్లోగా చెల్లించేవారికి ఈ తగ్గింపు వర్తిస్తుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఛైర్మన్ షేక్ తాయెబ్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఈ మేరకు డెసిషన్ని జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి రానున్న టోల్గేట్స్కి సంబంధించి కొన్ని వెసులుబాట్లు రాబోతున్నాయనీ, జనవరి 1 వరకు ఎలాంటి ఛార్జీలూ వసూలు వాహనాలకి వసూలు చేయబడవనీ ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం వున్న డైలీ క్యాప్ 16 దిర్హామ్స్కి అదనంగా, మంత్లీ లిమిట్ని ఇంట్రడ్యూస్ చేశారు. మోటరిస్ట్ తన తొలి వాహనానికి 200 దిర్హామ్లు చెల్లిస్తే సరిపోతుంది. రెండో వాహనానికి 150 దిర్హామ్లు, ప్రతి అదనపు వాహనానికి 100 దిర్హామ్లు చెల్లించాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







