భారత్ మాటలను అవాస్తవమన్న పాకిస్థాన్‌

- October 21, 2019 , by Maagulf
భారత్ మాటలను అవాస్తవమన్న పాకిస్థాన్‌

పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లో మూడు ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసినట్లు భారత ఆర్మీ చేసిన ప్రకటనను పాకిస్థాన్ మిలిటరీ కొట్టిపారేసింది. ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేశామని భారత ఆర్మీ చీఫ్ చేసిన ప్రకటన నిరుత్సాహాపరుస్తున్నదని పాక్ మేజరల్ జనరల్ గఫూర్ తెలిపారు. ఒకవేళ ఉగ్ర స్థావరాలు ధ్వంసం అయ్యింది నిజమే అయితే, ఆ ప్రాంతాలకు విదేశీ మీడియోను లేదా దౌత్యవేత్తలను తీసుకువెళ్లి చూపించాలన్నారు. జమ్మూకశ్మీర్‌లోని తంగ్‌దార్‌, కీరన్ సెక్టార్ల వద్ద భారత ఆర్మీ చేసిన ప్రతీకార దాడుల్లో పది మంది వరకు పాక్ జవాన్లు హతమైనట్లు ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ ఆదివారం ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాక్ మిలిటరీ ప్రతినిధి అసిఫ్ గఫూర్‌.. తన ట్వీట్‌లో భారత్ వాదనలను తోసిపుచ్చారు. పాక్‌లో ఉన్న భారత ఎంబసీ అధికారులు.. క్యాంపు ప్రాంతాలను విజిట్ చేయవచ్చు అని అన్నారు. స్వదేశీ అవసరాల దృష్టానే రావత్ ఆ కామెంట్ చేశారని, ఇది ప్రొఫెషనల్ మిలిటరీ నైతికతకు వ్యతిరేమని గఫూర్ ఆరోపించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com