అమ్మానాన్నలను కాదని ప్రియుడితో పరార్.. అనుమానాస్పద స్థితిలో..
- October 21, 2019
అసలే రోజులు బాగలేదు తల్లీ.. ప్రేమా దోమా అంటూ వెంటపడతారు.. అవసరం తీరాక వదిలించుకుంటారు.. పోనీ మీ ప్రేమ నిజమైంది అయితే మీ కాళ్ల మీద మీరు నిలబడ్డాక పెళ్లి చేసుకోండి అంటూ తల్లిదండ్రులు అమ్మాయికి ఎంతో నచ్చచెప్పారు. అయినా ప్రేమమైకంలో పడిన ఆమెకు అమ్మానాన్నల మాటలు చెవికెక్కలేదు. దాంతో నీ ఖర్మ.. అంటూ కూతురి గురించి పట్టించుకోవడం మానేశారు. ఫలితంగా 23 ఏళ్ల భవిత జీవితం బలైంది. కర్ణాటక హాసన్ పట్టణానికి చెందిన భవిత 18 ఏళ్ల వయసులో పునీత్ అనే యువకుడితో ప్రేమలో పడింది. తల్లిదండ్రులకు విషయం తెలిసి వారించారు. అయినా అతడితో ప్రేమ వ్యవహారం కొనసాగించింది. అతడినే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టింది. తాను మేజర్ని అని, తనకు నిర్ణయం తీసుకునే అధికారం ఉందని అమ్మానాన్నలతో గొడవ పడి ఇంట్లో నుంచి వెళ్లి పోయింది.
దీంతో తల్లిదండ్రులు కూడా పట్టించుకోవడం మానేశారు. భవిత ఎక్కడ ఉంటుందో ఎలా ఉందో తల్లిదండ్రులకు సమాచారం లేదు. ఇదిలా ఉండగా, ఆదివారం హాసన్ పట్టణంలోని ఓ హోటల్లో అనుమానాస్పద స్థితిలో ఓ యువతి మరణించిందన్న వార్త వెలుగు చూసింది. మృతురాలిని అరుకలగూడుకు చెందిన భవితగా పోలీసులు గుర్తించారు. పోలీసుల విచారణలో యువతి చేయిపై పునీత్ అనిపచ్చబొట్టు ఉన్నట్లు తెలిసింది. అంతే కాకుండా ఇప్పటి వరకు ఆమె ముగ్గురు యువకులను ప్రేమించినట్లు విచారణలో తేలింది. 12 రోజుల ముందు కూడా ఇదే హోటల్కు వచ్చినట్లు ఫేస్బుక్లో భవిత పోస్ట్ పెట్టింది. అప్పుడు కూడా ఇదే రూమ్లో ఉన్నానని గది ఫోటోలను కూడా అప్లోడ్ చేసింది. శనివారం రాత్రి పునీత్తో కలిసి వచ్చిన భవిత ఆదివారం ఉదయానికి విగత జీవిగా పడి ఉండడం పలు అనుమానాలు రేకెత్తిస్తోంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- కార్ డ్యాష్బోర్డ్పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు







