భారత్ మాటలను అవాస్తవమన్న పాకిస్థాన్
- October 21, 2019
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లో మూడు ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసినట్లు భారత ఆర్మీ చేసిన ప్రకటనను పాకిస్థాన్ మిలిటరీ కొట్టిపారేసింది. ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేశామని భారత ఆర్మీ చీఫ్ చేసిన ప్రకటన నిరుత్సాహాపరుస్తున్నదని పాక్ మేజరల్ జనరల్ గఫూర్ తెలిపారు. ఒకవేళ ఉగ్ర స్థావరాలు ధ్వంసం అయ్యింది నిజమే అయితే, ఆ ప్రాంతాలకు విదేశీ మీడియోను లేదా దౌత్యవేత్తలను తీసుకువెళ్లి చూపించాలన్నారు. జమ్మూకశ్మీర్లోని తంగ్దార్, కీరన్ సెక్టార్ల వద్ద భారత ఆర్మీ చేసిన ప్రతీకార దాడుల్లో పది మంది వరకు పాక్ జవాన్లు హతమైనట్లు ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ ఆదివారం ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాక్ మిలిటరీ ప్రతినిధి అసిఫ్ గఫూర్.. తన ట్వీట్లో భారత్ వాదనలను తోసిపుచ్చారు. పాక్లో ఉన్న భారత ఎంబసీ అధికారులు.. క్యాంపు ప్రాంతాలను విజిట్ చేయవచ్చు అని అన్నారు. స్వదేశీ అవసరాల దృష్టానే రావత్ ఆ కామెంట్ చేశారని, ఇది ప్రొఫెషనల్ మిలిటరీ నైతికతకు వ్యతిరేమని గఫూర్ ఆరోపించారు.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







