కర్తార్పూర్ కారిడార్ను ప్రారంభించనున్న ప్రధాని మోదీ
- October 22, 2019
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 9న భారత్ వైపున కర్తార్పూర్ కారిడార్ను ప్రారంభిస్తారు. పాకిస్తాన్లో నెలకొన్న సిక్కుల గురుద్వారాకు యాత్రికులతో కూడిన తొలి బ్యాచ్కు పచ్చజెండా ఊపుతారు. పంజాబ్లోని గురుదాస్పూర్ జిల్లాలో కర్తార్పూర్ యాత్రికుల కోసం కొత్తగా నిర్మించిన టెర్మినల్ వద్ద జరిగే కార్యక్రమానికి ప్రధాని హాజరవుతారు. కాగా, అదే రోజు తమ భూభాగంలో నిర్మంచిన కర్తార్పూర్ కారిడార్ను పాకిస్తాన్ ప్రారంభించి భారత యాత్రికుల తొలి బ్యాచ్ను స్వాగతిస్తుంది. పాకిస్తాన్ కారిడార్ నరోవల్ జిల్లాలో ఏర్పాటైంది. కర్తార్పూర్ కారిడార్ ప్రారంభోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లు, వివరాలను చర్చించేందుకు ఈనెల 23న తలపెట్టిన సమావేశానికి హాజరు కావాలని పాకిస్తాన్కు భారత్ ఆహ్వానం పంపింది. దీనిపై పాకిస్తాన్ ఇంకా స్పందించాల్సి ఉంది. మరోవైపు కర్తార్పూర్లో గురుద్వార దర్బార్ సాహిబ్ను సందర్శించే భారత యాత్రికుల నుంచి పాకిస్తాన్ 20 డాలర్ల ఫీజును వసూలు చేసే ప్రతిపాదనపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. భారత్ అభ్యంతరం పైనా పాకిస్తాన్ ఇప్పటివరకూ స్పందించలేదు.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







