యూ.ఏ.ఈ లో స్కూల్స్కు దీపావళి సెలవు
- October 25, 2019యూ.ఏ.ఈ: దీపావళి పండుగ సందర్భంగా యూ.ఏ.ఈలో 62 స్కూల్స్ సెలవు ప్రకటించాయి. ఈ మేరకు నాలెడ్జ్ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ అథారిటీ(కేహెచ్డీఎ) ఒక ప్రకటన విడుదల చేసింది. దీపావళి పండుగను పురస్కరించుకుని అక్టోబర్ 27, ఆదివారం రోజు యూ.ఏ.ఈలోని 62 పాఠశాలలు సెలవు ప్రకటించాయని, కొన్ని స్కూల్స్ అక్టోబర్ 28న కూడా హాలీడే ఇచ్చాయని, రెండు రోజులు లీవ్ ఇచ్చిన పాఠశాలలు తిరిగి మంగళవారం తెరుచుకోనున్నాయని పేర్కొంది. ఇండియన్ హై స్కూల్, దుబాయ్ అండ్ మిలీనియం స్కూల్ ఇలా రెండు రోజులు సెలవు ప్రకటించిన జాబితాలో ఉన్నాయి.
అలాగే షార్జాలో కూడా కొన్ని పాఠశాలలు దీపావళి లీవ్ ఇచ్చాయి.ఢిల్లీ ప్రైవేట్ స్కూల్,జీఈఎంఎస్ ఇంగ్లీష్ హై స్కూల్, జీఈఎంఎస్ మిలీనియం స్కూల్ ఆదివారం సెలవు ప్రకటించాయి. దుబాయ్ ఫెస్టివల్ సెంటర్ మాల్ లో స్పెషల్ షో నిర్వహించారు. ఇప్పటికే దుబాయ్ షాపింగ్ మాల్స్ భారీగా దీపావళి ఆఫర్స్తో కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా బంగారు ఆభరణాలపై భారీ ఆఫర్లు తీసుకొచ్చాయి.
తాజా వార్తలు
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్
- సౌదీ సాయంతో పట్టుబడ్డ 47 కిలోల కొకైన్
- OMR30.6 బిలియన్లు దాటిన క్రెడిట్ బ్యాలెన్స్
- యూఏఈలో CSI చర్చి.. ఫస్ట్ లుక్ ఔట్
- ఏపీలో భానుడి విశ్వరూపం, బెంబేలెత్తిపోతున్న జనం
- వైసీపీ మేనిఫెస్టో ఫై ప్రశ్నల అస్త్రాలను సంధిస్తున్న నెటిజన్లు
- ఎన్నికల ప్రచారంలో హీరో వెంకటేశ్..?!!
- ఖతార్ విమానయాన రంగం.. అద్భుతమైన వృద్ధి..!