యూ.ఏ.ఈ లో స్కూల్స్కు దీపావళి సెలవు
- October 25, 2019యూ.ఏ.ఈ: దీపావళి పండుగ సందర్భంగా యూ.ఏ.ఈలో 62 స్కూల్స్ సెలవు ప్రకటించాయి. ఈ మేరకు నాలెడ్జ్ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ అథారిటీ(కేహెచ్డీఎ) ఒక ప్రకటన విడుదల చేసింది. దీపావళి పండుగను పురస్కరించుకుని అక్టోబర్ 27, ఆదివారం రోజు యూ.ఏ.ఈలోని 62 పాఠశాలలు సెలవు ప్రకటించాయని, కొన్ని స్కూల్స్ అక్టోబర్ 28న కూడా హాలీడే ఇచ్చాయని, రెండు రోజులు లీవ్ ఇచ్చిన పాఠశాలలు తిరిగి మంగళవారం తెరుచుకోనున్నాయని పేర్కొంది. ఇండియన్ హై స్కూల్, దుబాయ్ అండ్ మిలీనియం స్కూల్ ఇలా రెండు రోజులు సెలవు ప్రకటించిన జాబితాలో ఉన్నాయి.
అలాగే షార్జాలో కూడా కొన్ని పాఠశాలలు దీపావళి లీవ్ ఇచ్చాయి.ఢిల్లీ ప్రైవేట్ స్కూల్,జీఈఎంఎస్ ఇంగ్లీష్ హై స్కూల్, జీఈఎంఎస్ మిలీనియం స్కూల్ ఆదివారం సెలవు ప్రకటించాయి. దుబాయ్ ఫెస్టివల్ సెంటర్ మాల్ లో స్పెషల్ షో నిర్వహించారు. ఇప్పటికే దుబాయ్ షాపింగ్ మాల్స్ భారీగా దీపావళి ఆఫర్స్తో కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా బంగారు ఆభరణాలపై భారీ ఆఫర్లు తీసుకొచ్చాయి.
తాజా వార్తలు
- ఏపీ, తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగింపు..
- ఎన్ఆర్ఐ ఖాతాదారులకు శుభవార్త
- బహ్రెయిన్లో నకిలీ యూనివర్సిటీలపై కొరడా..!
- పాలస్తీనియన్ బిడ్కు UN జనరల్ అసెంబ్లీ మద్దతు
- యూఏఈలో టాప్ 10 ప్రమాదకర రోడ్లు ఇవే..!
- జపాన్లో పర్యటించనున్న సౌదీ యువరాజు
- పార్లమెంటును రద్దు చేసిన కువైట్ ఎమిర్
- ఇజ్రాయెల్ ప్రధాని వ్యాఖ్యలను ఖండించిన యూఏఈ
- ఆర్టీసీ ఉద్యోగులు జీన్స్ ప్యాంట్లు, టీషర్ట్స్ వేసుకోకూడదు: ఎండీ సజ్జనార్
- బంపర్ న్యూస్..బంగారం రేట్ భారీగా తగ్గింది