యూ.ఏ.ఈ లో స్కూల్స్కు దీపావళి సెలవు
- October 25, 2019యూ.ఏ.ఈ: దీపావళి పండుగ సందర్భంగా యూ.ఏ.ఈలో 62 స్కూల్స్ సెలవు ప్రకటించాయి. ఈ మేరకు నాలెడ్జ్ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ అథారిటీ(కేహెచ్డీఎ) ఒక ప్రకటన విడుదల చేసింది. దీపావళి పండుగను పురస్కరించుకుని అక్టోబర్ 27, ఆదివారం రోజు యూ.ఏ.ఈలోని 62 పాఠశాలలు సెలవు ప్రకటించాయని, కొన్ని స్కూల్స్ అక్టోబర్ 28న కూడా హాలీడే ఇచ్చాయని, రెండు రోజులు లీవ్ ఇచ్చిన పాఠశాలలు తిరిగి మంగళవారం తెరుచుకోనున్నాయని పేర్కొంది. ఇండియన్ హై స్కూల్, దుబాయ్ అండ్ మిలీనియం స్కూల్ ఇలా రెండు రోజులు సెలవు ప్రకటించిన జాబితాలో ఉన్నాయి.
అలాగే షార్జాలో కూడా కొన్ని పాఠశాలలు దీపావళి లీవ్ ఇచ్చాయి.ఢిల్లీ ప్రైవేట్ స్కూల్,జీఈఎంఎస్ ఇంగ్లీష్ హై స్కూల్, జీఈఎంఎస్ మిలీనియం స్కూల్ ఆదివారం సెలవు ప్రకటించాయి. దుబాయ్ ఫెస్టివల్ సెంటర్ మాల్ లో స్పెషల్ షో నిర్వహించారు. ఇప్పటికే దుబాయ్ షాపింగ్ మాల్స్ భారీగా దీపావళి ఆఫర్స్తో కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా బంగారు ఆభరణాలపై భారీ ఆఫర్లు తీసుకొచ్చాయి.
తాజా వార్తలు
- పిల్లలకు సోషల్ మీడియా వినియోగం పరిమితం చేయాలా?
- GCC దేశాల కోసం ఇ-వీసాలు.. వ్యాలిడిలీ, డాక్యుమెంట్ ప్రాసెస్
- వార్షిక సౌదీ గ్రీన్ ఇనిషియేటివ్ డే.. లక్ష్యాలను ప్రకటించిన సౌదీ అరేబియా
- అజాన్ లేదా ప్రార్థనల పై తప్పుడు ప్రచారం.. ఖండించిన షార్జా
- విదేశీ కంపెనీలలో పౌరుల నియమకం..ఒమన్ కీలక ఉత్తర్వులు
- నేటి నుంచి జగన్ ఎన్నికల ప్రచారం ప్రారంభం
- ఆధార్ ఫ్రీ అప్డేట్ గడువు పొడిగింపు..
- వేసవిలో చికెన్పాక్స్ ముప్పు.. నివాసితులను వైద్యులు హెచ్చరిక
- పారిపోతున్న పనిమనిషి కేసులు పెరుగుతున్నాయా?
- రియాద్లో అర్హత లేని ఆరోగ్య నిపుణులు అరెస్ట్