దుబాయ్:రోడ్డు ప్రమాదంలో 21 మందికి గాయాలు

- October 25, 2019 , by Maagulf
దుబాయ్:రోడ్డు ప్రమాదంలో 21 మందికి గాయాలు

దుబాయ్:ఎమిరేట్స్‌ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 21 మంది గాయాలపాలయ్యారు. దుబాయ్‌ - షార్జా మధ్య ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. షార్జా ఇండస్ట్రియల్‌ ఏరియాకి వర్కర్స్‌ని తీసుకెళుతుండగా బస్‌ ప్రమాదానికి గురయినట్లు అధికారులు పేర్కొన్నారు. గాయపడ్డడారిలో ఆసియన్‌ కార్మికులు వున్నట్లు తెలుస్తోంది. గాయపడ్డవారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అందులో 16 మందికి స్వల్ప వైద్య చికిత్స అనంతరం డిశ్చార్జ్‌ చేశారు. మిగిలినవారికి అల్‌ కాసిమి హాస్పిటల్‌లో వైద్య చికిత్స అందుతోంది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com