దుబాయ్: రూ. పది కోట్లు కాజేసి భార్యను ఇరికించి పరార్..
- October 26, 2019
దుబాయ్: తిండి పెడుతున్న సంస్థకే ఓ వ్యక్తి కన్నం వేశాడు. దుబాయ్లోని ఓ స్థానిక బ్యాంకులో పనిచేస్తున్న పాకిస్థాన్కు చెందిన ఓ వ్యక్తి తన పరపతిని ఉపయోగించి బ్యాంకులోని వివిధ డాక్యుమెంట్లను దొంగిలించి.. వాటి ద్వారా 5.2 మిలియన్ దిర్హామ్(రూ. పది కోట్లకు పైనే)లను కాజేశాడు. 2011 నుంచి 2017 జులై వరకు నిందితుడు ఈ నేరాలకు పాల్పడినట్టు అధికారులు చెబుతున్నారు. అయితే నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉండటంతో.. దుబాయ్ పోలీసులు నిందితుడి భార్యను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు కాజేసిన డబ్బులో చాలా భాగం.. అతడి భార్య అకౌంట్లకే పంపినట్టు పోలీసులు గుర్తించారు. నిందితుడి భార్య కూడా ఏటీఎంలలో ఆ డబ్బును విత్డ్రా చేయడం, చెక్కుల ద్వారా డబ్బును ఆమె అకౌంట్ల నుంచి వేరే అకౌంట్లకు పంపించడం చేస్తూ వచ్చినట్టు పోలీసులు తెలిపారు. దీంతో ఆమెపై కూడా పోలీసులు కేసును నమోదు చేశారు. అయితే ఈ దోపిడీకి తనకు ఎటువంటి సంబంధం లేదని నిందితుడి భార్య కోర్టుకు తెలిపింది. తన భర్త ఏం చేస్తున్నాడనేది కూడా తనకు ఎన్నడూ చెప్పలేదని జడ్జికి వివరించింది. కాగా, కోర్టు ఈ కేసును నవంబరుకు వాయిదా వేసింది.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







