దుబాయ్: రూ. పది కోట్లు కాజేసి భార్యను ఇరికించి పరార్..
- October 26, 2019
దుబాయ్: తిండి పెడుతున్న సంస్థకే ఓ వ్యక్తి కన్నం వేశాడు. దుబాయ్లోని ఓ స్థానిక బ్యాంకులో పనిచేస్తున్న పాకిస్థాన్కు చెందిన ఓ వ్యక్తి తన పరపతిని ఉపయోగించి బ్యాంకులోని వివిధ డాక్యుమెంట్లను దొంగిలించి.. వాటి ద్వారా 5.2 మిలియన్ దిర్హామ్(రూ. పది కోట్లకు పైనే)లను కాజేశాడు. 2011 నుంచి 2017 జులై వరకు నిందితుడు ఈ నేరాలకు పాల్పడినట్టు అధికారులు చెబుతున్నారు. అయితే నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉండటంతో.. దుబాయ్ పోలీసులు నిందితుడి భార్యను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు కాజేసిన డబ్బులో చాలా భాగం.. అతడి భార్య అకౌంట్లకే పంపినట్టు పోలీసులు గుర్తించారు. నిందితుడి భార్య కూడా ఏటీఎంలలో ఆ డబ్బును విత్డ్రా చేయడం, చెక్కుల ద్వారా డబ్బును ఆమె అకౌంట్ల నుంచి వేరే అకౌంట్లకు పంపించడం చేస్తూ వచ్చినట్టు పోలీసులు తెలిపారు. దీంతో ఆమెపై కూడా పోలీసులు కేసును నమోదు చేశారు. అయితే ఈ దోపిడీకి తనకు ఎటువంటి సంబంధం లేదని నిందితుడి భార్య కోర్టుకు తెలిపింది. తన భర్త ఏం చేస్తున్నాడనేది కూడా తనకు ఎన్నడూ చెప్పలేదని జడ్జికి వివరించింది. కాగా, కోర్టు ఈ కేసును నవంబరుకు వాయిదా వేసింది.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







