ఇకపై ఫేస్ బుక్లో ఫేక్ న్యూస్కు చెక్
- October 26, 2019
సోషల్ మీడియాలో ఫేక్ వార్తలకు చెక్ పెట్టేందుకు ఫేస్బుక్ కొత్త అప్డేట్తో ముందుకు వస్తుంది. 'న్యూస్ ట్యాబ్' పేరుతో వార్తలను అందించేందుకు ఫేస్బుక్ సిద్ధం అయ్యింది. ఏది నిజమో.. ఏది అబద్ధమో.. సులభంగా యూజర్లు గ్రహించేలా.. ఉన్నత విలువలతో.. జర్నలిజం స్థాయిని పెంచేలా 'న్యూస్ ట్యాబ్' ఉంటుందని ఫేస్బుక్ ప్రకటనలో వెల్లడించింది. న్యూయార్క్లో శుక్రవారం జరిగిన సమావేశంలో 'న్యూస్ ట్యాబ్'ను ఆ సంస్థ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ ప్రకటించారు.
ఈ సందర్భంగా జుకర్ బర్గ్ మాట్లాడుతూ.. న్యూస్ ఏజెన్సీలు అందించే వార్తలను దీనిలో పొందుపరుస్తామని.. జర్నలిజం, ఫేక్ న్యూస్ మధ్య స్పష్టత తెచ్చేందుకు కొత్తగా ఈ రకంగా ముందుకు వస్తున్నట్లు ఫేస్నబుక్ వెల్లడించింది. న్యూస్ కోసం ప్రత్యేకంగా ఒక ఆప్షన్ ఏర్పాటు చేయడం ఇదే తొలిసారని ఆయన చెప్పారు. ప్రస్తుతానికి అమెరికాలో మాత్రమే దీనిని అందుబాటులోకి తీసుకుని వస్తుండగా.. రాబోయే రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా దీనిని అందుబాటులోకి తీసుకుని రానున్నారు.
'న్యూస్ ట్యాబ్' కోసం రెండు వందలకు పైగా వార్తా సంస్థలతో ఫేస్ బుక్ ఒప్పందం కుదుర్చుకోనుంది. వాల్ స్ట్రీట్ జర్నల్, వాషింగ్టన్ పోస్ట్, సీబీఎన్ న్యూస్, బజ్ ఫీడ్, ఫాక్స్ న్యూస్, బాస్టన్ గ్లోబ్ వంటి సంస్థలు ఇందులో భాగస్వామ్యం కానున్నాయి.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







