గిన్నిస్ వరల్డ్ రికార్డుకెక్కనున్న అయోధ్య..
- October 26, 2019
ఉత్తర్ప్రదేశ్:శ్రీరాముడు జన్మించిన అతి పవిత్రమైన అయోధ్య నగరం గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించనుంది. ఉత్తర్ప్రదేశ్లోని యోగి ఆదిత్యానాథ్ ప్రభుత్వం ఈ మేరకు ఏర్పాట్లు సిద్ధం చేసింది. అసలు విషయానికొస్తే.. దీపావళిని పురస్కరించుకొని ఇవాళ సాయంత్రం అయోధ్యలో 5.51లక్షల మట్టి ప్రమిదలలో దీపాలు వెలిగించి ‘దీపోత్సవం’ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించనున్నారు. ఈ దీపోత్సవాన్ని యూపీ సర్కారు రాష్ట్ర పండగగా ప్రకటించి ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తుండగా.. లక్షల దీపాలతో అయోధ్య నగరాన్ని అలంకరించాలని సీఎం యోగి నిర్ణయించారు. అద్భుతంగా కన్నుల పండుగ జరిగే ఈ దీపోత్సవానికి భక్తులు కూడా భారీగా తరలిరానున్నారు. దీని కోసం సీఎం ఆదిత్యానాథ్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేసింది.
ఇక ఈ కార్యక్రమంలో యూపీ గవర్నర్ ఆనందిబెన్ పటేల్, సీఎం యోగి ఆదిత్యనాథ్, ఫీజీ రిపబ్లిక్ డిప్యూటీ స్పీకర్ వీణ భట్నాగల్, యూపీ మంత్రులు పాల్గొనున్నారు. అయోధ్య దీపోత్సవంలో ఈ ఉదయం 10 గంటల నుంచి ఊరేగింపు కూడా ప్రారంభమైంది. సాకేత్ కళాశాల నుంచి రామకథ పార్కు వరకు సాగనున్న ఈ ఊరేగింపులో దేశంలోని నలుమూలల నుంచి కళాకారులు పాల్గొన్నారు. సీతారాములను ఆరాధించడంతో పాటు రాముడి పట్టాభిషేకం సాగనుంది. రామలీలా కార్యక్రమంలో ఏడు దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొంటారు. ఈ సందర్భంగా రూ.226 కోట్లతో పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను సీఎం యోగి ప్రారంభించనున్నారు. ఇక ఈ రాత్రి చేపట్టనున్న ‘దీపోత్సవం’ గిన్నిస్ వరల్డ్ రికార్డుగా నిలవనుంది. కాగా 2018 లో యోగీ ఆదిత్యానాథ్ ప్రభుత్వం సరయు నదీ తీరంలో 3 లక్షల 150 మంటి మట్టి దీపాలను వెలిగించి ‘దీపోత్సవ’ వేడుకలు చేసిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







