హుజుర్నగర్పై వరాల జల్లు కురిపించిన కేసీఆర్
- October 26, 2019
తెలంగాణ:ఇటీవల జరిగిన హుజూర్నగర్ ఉప ఎన్నిక ఫలితాల్లో టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందారు. దీంతో కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న హుజూర్నగర్ ఇప్పుడు టీఆర్ఎస్ ఖాతాలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఇవాళ భారీ బహిరంగ సభను నిర్వహించబోతున్నట్లు గురువారం వెల్లడించిన సీఎం కేసీఆర్.. దీనికి ప్రజా కృతజ్ఞత సభగా పేరు పెట్టారు. అయితే ఈ ఫలితాలపై ఆర్టీసీ సమ్మె ప్రభావం పడుతుందని అందరూ భావించారు. కానీ ప్రజలు మాత్రం టీఆర్ఎస్కే పట్టం కట్టారు. ఈ నేపథ్యంలో ఈ సభలో పాల్గొననున్న కేసీఆర్.. హుజూర్ నగర్ ప్రజలకు భారీ వరాలు ప్రకటిస్తారని సమాచారం.
కాగా ఈ సభకు హైదరాబాద్ నుంచీ కేసీఆర్ రోడ్డు మార్గంలో రానున్నారు. అందుకు సంబంధించిన పూర్తి ఏర్పాట్లను అధికారులు చేశారు. మొత్తం లక్ష మందిని సభకు తరలించాలని టీఆర్ఎస్ వర్గాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. వచ్చేవారికి ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా చాలా మంది మంత్రులు అక్కడే ఉండి ఏర్పాట్లను చేశారు.
తాజా వార్తలు
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..
- 12 ఏళ్ల బాలుడికి 3D మ్యాపింగ్తో అరుదైన గుండె సమస్యకు విజయవంతమైన చికిత్స







