హుజుర్నగర్పై వరాల జల్లు కురిపించిన కేసీఆర్
- October 26, 2019
తెలంగాణ:ఇటీవల జరిగిన హుజూర్నగర్ ఉప ఎన్నిక ఫలితాల్లో టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందారు. దీంతో కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న హుజూర్నగర్ ఇప్పుడు టీఆర్ఎస్ ఖాతాలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఇవాళ భారీ బహిరంగ సభను నిర్వహించబోతున్నట్లు గురువారం వెల్లడించిన సీఎం కేసీఆర్.. దీనికి ప్రజా కృతజ్ఞత సభగా పేరు పెట్టారు. అయితే ఈ ఫలితాలపై ఆర్టీసీ సమ్మె ప్రభావం పడుతుందని అందరూ భావించారు. కానీ ప్రజలు మాత్రం టీఆర్ఎస్కే పట్టం కట్టారు. ఈ నేపథ్యంలో ఈ సభలో పాల్గొననున్న కేసీఆర్.. హుజూర్ నగర్ ప్రజలకు భారీ వరాలు ప్రకటిస్తారని సమాచారం.
కాగా ఈ సభకు హైదరాబాద్ నుంచీ కేసీఆర్ రోడ్డు మార్గంలో రానున్నారు. అందుకు సంబంధించిన పూర్తి ఏర్పాట్లను అధికారులు చేశారు. మొత్తం లక్ష మందిని సభకు తరలించాలని టీఆర్ఎస్ వర్గాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. వచ్చేవారికి ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా చాలా మంది మంత్రులు అక్కడే ఉండి ఏర్పాట్లను చేశారు.
తాజా వార్తలు
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!







