ఢిల్లీలో పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ.!
- November 01, 2019
ఢిల్లీలో వాయుకాలుష్యం తీవ్రస్థాయికి పెరిగింది. వాయు కాలుష్యస్థాయి మరింత పెరిగి..గాలి నాణ్యత మరింత క్షీణించింది. దీంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇంటి నుంచి బయటకు రావాలంటే ప్రజలు భయపడుతున్నారు. ఇవాళ(నవంబర్-1,2019)ఢిల్లీలోని ఇండియా గేట్,ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియం పరిసరాల్లో ఎయిర్ క్వాలిటీ తీవ్రస్థాయిలో ఉన్నట్లు నేషనల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(NAQI),సెంట్రల్ పొల్యూషన్ బోర్డు తెలిపింది. నోయిడాలో కూడా తీవ్రస్థాయిలో ఎయిర్ క్వాలిటీ ఉన్నట్లు తెలిపింది.
దీంతో ఢిల్లీ,దాని పరిసర ప్రాంతాల్లో పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ విధించింది ఎన్విరాన్మెంట్ పొల్యూషన్(ప్రివెన్షన్ ఆర్ కంట్రోల్)అథారిటీ. అంతేకాకుండా నవంబర్ 5వరకు ఎటువంటి నిర్మాణా పనులు జరగకుండా నిషేధం విధించింది. అంతేకాకుండా చలికాలంలో క్రకార్స్ కాల్చకుండా నిషేధం విధించింది. దీపావళి రోజు రాత్రి నుంచి ఢిల్లీలో వాయుకాలుష్యం తీవ్రస్థాయికి చేరిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!
- యూఏఈలో పిల్లల స్కూల్ లంచ్..నెలకు Dh800 వరకు ఖర్చు..!!
- విద్యా సంస్థల లైసెన్సులు, ఫీజులపై తనిఖీలు చేయాలి..!!
- సౌదీ - ఫ్రాన్స్ సంబంధాల్లో కీలక ముందడుగు..!!
- పిల్లల బ్యాక్ప్యాక్ల ఎంపిక..ఖతార్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక సూచనలు..!!
- 14 దేశాలకు పార్టీ అధ్యక్షులను నియమించిన TRS పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత
- ఒమన్ పౌరులకు గుడ్ న్యూస్ చెప్పిన బోట్స్వానా..!!
- ఆహార భద్రతపై భారత్–కువైట్ చర్చలు..!!
- పేషంట్ మృతికి కారణమైన డాక్టర్లకు ఆరు నెలల జైలుశిక్ష..!!







