ఇద్దరు వ్యక్తులపై క్రికెట్ బ్యాట్లతో దాడి
- November 04, 2019
యూ.ఏ.ఈ:ఇద్దరు ఆసియా వ్యక్తులపై దాడి జరిగింది. దుండగులు, బాధితుల్ని కిడ్నాప్ చేసి, వారిపై క్రికెట్ బ్యాట్లతో దాడి చేసి, ఎడారిలో డంప్ చేసిన ఘటన అల్ సజ్జా ఇండస్ట్రియల్ ఏరియాకి సమీపంలో జరిగింది. బాధితులకు తీవ్రగాయాలయ్యాయి. అల్ కాసిమి హాస్పిటల్లో ప్రాణాలతో పోరాడుతున్నారు బాధితులు.ఓ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వెహికిల్ డ్రైవర్ తమకు సమాచారం అందించారనీ, ఈ నేపథ్యంలో సంఘటనా స్థలానికి చేరుకుని, బాధితులను ఆసుపత్రికి తరలించామని అధికారులు వివరించారు. ముగ్గురు వ్యక్తులు తమపై దాడి చేసినట్లు బాధితులు పోలీసులకు తెలిపారు. శరీరంపై తీవ్రగాయాలు వున్నాయనీ, బాధితుల లివర్ దెబ్బతిందనీ, ఇద్దరికీ శస్త్ర చికిత్సలు అవసరమని అల్ ఖాసిమి హాస్పిటల్ అధికారి వివరించారు.
తాజా వార్తలు
- మహిళా బిల్లు పై ఎంపీలకు ప్రధాని మోదీ పిలుపు
- సీబీఐ కోర్టులో వైఎస్ జగన్కు రిలీఫ్..
- ఇండోనేషియాలో కుప్పకూలిన హెలికాప్టర్ఎనిమిది మంది దుర్మరణం
- చిన్ననాటి స్నేహితుడి కోసం సచిన్.. వినోద్ కాంబ్లీకి అండగా మాజీ క్రికెటర్లు
- కొత్త రాయబారుల క్రెడెన్షియల్స్ స్వీకరించిన యూఏఈ ప్రెసిడెంట్..!!
- ట్రాన్స్మిషన్ లోపం..18,708 Toyota-Lexus వాహనాలు రీకాల్..!!
- నిషేధిత రంగాలకు కార్మికుల బదిలీ..కువైట్ అనుమతి..!!
- యూఏఈ లేబర్ మార్కెట్ స్టెబుల్..సకాలంలో సాలరీలు క్రిడెట్..!!
- నకిలీ హజ్ సేవల ప్రచారం..ఈజిప్షియన్ అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాల పై కింగ్ సుల్తాన్, ఖతార్ ఎమిర్ చర్చలు..!!









