ఇద్దరు వ్యక్తులపై క్రికెట్ బ్యాట్లతో దాడి
- November 04, 2019
యూ.ఏ.ఈ:ఇద్దరు ఆసియా వ్యక్తులపై దాడి జరిగింది. దుండగులు, బాధితుల్ని కిడ్నాప్ చేసి, వారిపై క్రికెట్ బ్యాట్లతో దాడి చేసి, ఎడారిలో డంప్ చేసిన ఘటన అల్ సజ్జా ఇండస్ట్రియల్ ఏరియాకి సమీపంలో జరిగింది. బాధితులకు తీవ్రగాయాలయ్యాయి. అల్ కాసిమి హాస్పిటల్లో ప్రాణాలతో పోరాడుతున్నారు బాధితులు.ఓ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వెహికిల్ డ్రైవర్ తమకు సమాచారం అందించారనీ, ఈ నేపథ్యంలో సంఘటనా స్థలానికి చేరుకుని, బాధితులను ఆసుపత్రికి తరలించామని అధికారులు వివరించారు. ముగ్గురు వ్యక్తులు తమపై దాడి చేసినట్లు బాధితులు పోలీసులకు తెలిపారు. శరీరంపై తీవ్రగాయాలు వున్నాయనీ, బాధితుల లివర్ దెబ్బతిందనీ, ఇద్దరికీ శస్త్ర చికిత్సలు అవసరమని అల్ ఖాసిమి హాస్పిటల్ అధికారి వివరించారు.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







