ఇద్దరు వ్యక్తులపై క్రికెట్ బ్యాట్లతో దాడి
- November 04, 2019
యూ.ఏ.ఈ:ఇద్దరు ఆసియా వ్యక్తులపై దాడి జరిగింది. దుండగులు, బాధితుల్ని కిడ్నాప్ చేసి, వారిపై క్రికెట్ బ్యాట్లతో దాడి చేసి, ఎడారిలో డంప్ చేసిన ఘటన అల్ సజ్జా ఇండస్ట్రియల్ ఏరియాకి సమీపంలో జరిగింది. బాధితులకు తీవ్రగాయాలయ్యాయి. అల్ కాసిమి హాస్పిటల్లో ప్రాణాలతో పోరాడుతున్నారు బాధితులు.ఓ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వెహికిల్ డ్రైవర్ తమకు సమాచారం అందించారనీ, ఈ నేపథ్యంలో సంఘటనా స్థలానికి చేరుకుని, బాధితులను ఆసుపత్రికి తరలించామని అధికారులు వివరించారు. ముగ్గురు వ్యక్తులు తమపై దాడి చేసినట్లు బాధితులు పోలీసులకు తెలిపారు. శరీరంపై తీవ్రగాయాలు వున్నాయనీ, బాధితుల లివర్ దెబ్బతిందనీ, ఇద్దరికీ శస్త్ర చికిత్సలు అవసరమని అల్ ఖాసిమి హాస్పిటల్ అధికారి వివరించారు.
తాజా వార్తలు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!







