కువైట్లో ఘోర ప్రమాదం.. కేరళ నర్సు మృతి..
- November 10, 2019
కువైట్ సిటీ: కువైట్లో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కేరళ రాష్ట్రానికి చెందిన నర్సు మృత్యువాతపడింది. ఈ దుర్ఘటనలో మరో ఐదుగురు నర్సులు స్వల్పంగా గాయపడ్డారు. మృతురాలిని కేఆర్హెచ్ కంపెనీ తరఫున కేఓసీ ఆసుపత్రిలో పనిచేస్తున్న మేరీగా గుర్తించారు. విధులు ముగించుకొని తిరిగి ఇంటికి వస్తున్న నర్సుల వాహనాన్ని మరో ప్రైవేట్ వాహనం ఢీకొట్టింది. దీంతో అందులోంచి మేరీ అమాంతం వాహనం వెనక చక్రం కింద పడిపోయింది. ఆమెపై నుంచి వాహనం వెళ్లిపోవడంతో అక్కడికక్కడే చనిపోయింది. మరో ఐదుగురు స్వల్పంగా గాయపడ్డారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ప్రమాదస్థలికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స కోసం సమీపంలోని అదాన్ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం ఆరో రోడ్, అహ్మదీ రోడ్ల మధ్య శనివారం రాత్రి 9 గంటలకు చోటుచేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. మేరీ భర్తతో పాటు కువైట్లో ఉంటున్నట్లు సమాచారం. వారి కూతురు మాత్రం కేరళలోనే ఉంటుంది. మేరీ మృతివార్తతో ఆమె స్వస్థలంలో విషాదచాయలు అలుముకున్నాయి. తల్లి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిందని తెలుసుకొని కూతురు గుండెలవిసేలా విలపిస్తోంది.
తాజా వార్తలు
- దేశ వారసత్వ సంపద వెలకట్టలేని ఆస్తి: సీపీ సీవీ ఆనంద్
- జూలై 15 నుంచి యూట్యూబ్ కొత్త రూల్స్..
- Emirates signs MoU with Crypto.com for future integration of Crypto.com Pay as a payment option for customers
- యాపిల్ సీవోవోగా భారత సంతతి చెందిన సబిహ్ కాన్
- అమెరికాలో క్రికెట్ కప్ గెలిచిన టాలీవుడ్ స్టార్స్..
- గగన్యాన్ ప్రాజెక్టులో ఇస్రో మరో ముందగుడు
- దుబాయ్లో ఘనంగా జరిగిన వైఎస్సార్ జయంతి
- దుబాయ్ లో డెలివరీ బైక్ రైడర్లకు ఆర్టీఏ గుడ్ న్యూస్..!!
- సౌదీలో 21 నాన్ ప్రాఫిట్ సంస్థలు, 26 వెబ్సైట్లపై చర్యలకు ఆదేశాలు..!!
- సహెల్ యాప్లో గృహ కార్మికులకు ఎగ్జిట్ పర్మిట్.. కువైట్ క్లారిటీ..!!