విజయవాడలో ఘనంగా గురునానక్ జయంతి వేడుకలు

- November 10, 2019 , by Maagulf
విజయవాడలో ఘనంగా గురునానక్ జయంతి వేడుకలు

విజయవాడ: నగరంలో ఘనంగా గురునానక్ 550వ జయంతి వేడుకలు జరిగాయి. నగర సంకీర్తన, వివిధ విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. సిక్కులు సంకీర్తనలో పిల్లలు, మహిళలు, వృద్ధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిక్కు మత పెద్దలు మాట్లాడుతూ తోటి‌వారి పట్ల మానవత్వంతో మెలగాలని, సేవా గుణాన్ని అలవరచుని సాయం అందించాలన్నారు. అన్నిమతాల ధర్మాన్ని కాపాడాలని గురునానక్ చెప్పారని.. అందుకే.. అనేక రకాల విన్యాసాల ద్వారా గురునానక్‌ను కొలుస్తామన్నారు. 12వ తేదీన గురునానక్ జయంతి సందర్భంగా గురుద్వార్‌లో వివిధ రకాల పూజా కార్యక్రమాలు, అన్నదానం నిర్వహిస్తారని సిక్కు మత పెద్దలు చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com