కశ్మీర్పై వెనక్కి తగ్గిన బ్రిటన్ లేబర్ పార్టీ
- November 13, 2019
లండన్: కశ్మీర్లోకి అంతర్జాతీయ పరిశీలకులను అనుమతించాలని, అక్కడ ప్రజలకు నిర్ణయాధికారాన్ని కల్పించాలని బ్రిటన్లోని ప్రధాన ప్రతిపక్షం అయినలేబర్ పార్టీ నాయకుడు జెరెమి కోర్బిన్ గత సెప్టెంబర్లో ఐరాస నేతృత్వంలో డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. కాగా అక్కడి భారతీయ వర్గాల నుండి త్రీవస్థాయిలో నిరసనలు వ్యక్తం కావడంతో తమ అభిప్రాయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ఆ పార్టీ ఛైర్మన్ ఇయాన్ లావెరీ తెలిపారు. కశ్మీర్ అంశం ద్వైపాక్షిక అంశమని తేల్చి చెప్పారు, ఇతర దేశాల వ్వవహారాల్లో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేస్తూ ఓ ప్రకటనను విడుదల చేశారు. కశ్మీర్పై భారత్కు వ్యతిరేకంగా వ్యవహరించబోమని, అంతర్జాతీయ పరిశీలనకు అనుమతించాలంటూ చేసిన తీర్మానం భావోద్వేగ సందర్భంలో తీసుకోవాల్సివచ్చిందని అభివర్ణించారు. కాగా అప్పట్లో భారత విదేశాంగ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ ఓటు బ్యాంకు ప్రయోజనాల కోసమే లేబర్ పార్టీ ఇటువంటి చర్యలకు దిగిందని వ్యాఖ్యానించారు.
తాజా వార్తలు
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు







