కశ్మీర్పై వెనక్కి తగ్గిన బ్రిటన్ లేబర్ పార్టీ
- November 13, 2019
లండన్: కశ్మీర్లోకి అంతర్జాతీయ పరిశీలకులను అనుమతించాలని, అక్కడ ప్రజలకు నిర్ణయాధికారాన్ని కల్పించాలని బ్రిటన్లోని ప్రధాన ప్రతిపక్షం అయినలేబర్ పార్టీ నాయకుడు జెరెమి కోర్బిన్ గత సెప్టెంబర్లో ఐరాస నేతృత్వంలో డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. కాగా అక్కడి భారతీయ వర్గాల నుండి త్రీవస్థాయిలో నిరసనలు వ్యక్తం కావడంతో తమ అభిప్రాయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ఆ పార్టీ ఛైర్మన్ ఇయాన్ లావెరీ తెలిపారు. కశ్మీర్ అంశం ద్వైపాక్షిక అంశమని తేల్చి చెప్పారు, ఇతర దేశాల వ్వవహారాల్లో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేస్తూ ఓ ప్రకటనను విడుదల చేశారు. కశ్మీర్పై భారత్కు వ్యతిరేకంగా వ్యవహరించబోమని, అంతర్జాతీయ పరిశీలనకు అనుమతించాలంటూ చేసిన తీర్మానం భావోద్వేగ సందర్భంలో తీసుకోవాల్సివచ్చిందని అభివర్ణించారు. కాగా అప్పట్లో భారత విదేశాంగ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ ఓటు బ్యాంకు ప్రయోజనాల కోసమే లేబర్ పార్టీ ఇటువంటి చర్యలకు దిగిందని వ్యాఖ్యానించారు.
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్







